Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: వెంకన్న దర్శనం విషయంలో స్వామీజీలు అలక.. అడిషనల్ ఈవో వర్సెస్ స్వామీజీలు

శ్రీవారి దర్శనం విషయంలో ఇప్పుడు టీటీడీ వర్సెస్ స్వామీజీలుగా వ్యవహారం మారింది. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసనంద సరస్వతి వర్సెస్ టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి మధ్య వార్ నెలకొంది. తిరుపతికి వచ్చిన సాధువులకు స్వామీజీలకు మాతాజీలకు దర్శనం అవకాశం కల్పించాలన్న విజ్ఞప్తిని తోసి పుచ్చడం వివాదానికి కారణం అయ్యింది. అడిగినన్ని దర్శనం టికెట్లు ఇవ్వాలని స్వామీజీలు, రద్దీ దృష్ట్యా అందరికీ దర్శనం కల్పించలేమని టీటీడీ తేల్చి వేయడంతో వ్యవహారం రచ్చగా మారింది.

Tirumala: వెంకన్న దర్శనం విషయంలో స్వామీజీలు అలక.. అడిషనల్ ఈవో వర్సెస్ స్వామీజీలు
Ttd Responds To Swamiji’s Claims
Follow us
Raju M P R

| Edited By: Surya Kala

Updated on: Oct 30, 2024 | 11:59 AM

తిరుమల వెంకన్న క్షేత్రంలో స్వామీజీలకు శ్రీవారి దర్శన భాగ్యం కలగక పోవడం మరో వివాదంగా మారింది. ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 26న తిరుపతిలో జరిగిన జాతీయ సదస్సుకు హాజరైన స్వామీజీలు శ్రీవారి దర్శనం చేసుకోకుండానే వెను తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే ఇప్పుడు స్వామీజీలు, టీటీడీ అదనపు ఈఓ మధ్య వివాదంగా నిలిచింది. ఈ నెల 26 న తిరుపతిలో జరిగిన జాతీయ హిందూ ధార్మిక సదస్సులో పాల్గొన్న స్వామీజీలు పలు డిమాండ్లను తెరమీదకి తెచ్చారు.

భారతదేశానికి ఆధ్యాత్మిక రాజధానిగా ఉన్న తిరుపతి పవిత్రతను మరింత పెంచాలన్న వాదన వినిపించిన స్వామీజీలు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన స్వామీజీలు మాతాజీలు పాల్గొన్న ధార్మిక సదస్సు పలు తీర్మానాలను చేశారు. తిరుపతిలో మద్యం మాంసం అమ్మకాలు లేకుండా చేయాలన్న ప్రధాన డిమాండ్ తో పాటు టీటీడీ వీఐపీ సిఫారసు లేఖలను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. వందలాదిగా వచ్చిన సాధుసంపత్తులు ధార్మిక సదస్సు అనంతరం 27 న శ్రీవారిని దర్శించుకోవాలనుకున్తున్నట్లు టీటీడీని కోరారు. సదస్సు నిర్వహించిన ఏపీ సాగు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి ఈ మేరకు టీటీడీ అధికారులను 10 రోజుల ముందుగానే కలిశారు.

దేశంలోని పలు ప్రాంతాల నుంచి వస్తున్న స్వామీజీలకు వారి శిష్యులకు 600 మందికి వసతితో పాటు శ్రీవారి దర్శనం కల్పించాలని కోరారు. అయితే టీటీడీ ఇందుకు నిరాకరించిందంటూ మీడియా ముందుకు వచ్చిన స్వామీజీలు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తీరును తప్పు పట్టారు. కనీసం మర్యాద కూడా అదనపు ఈవో కార్యాలయంలో స్వామీజీలకు లభించలేదని వాపోయారు. తిరుమలలో కార్పొరేట్ కంపెనీలకు అర్హత లేని వ్యక్తులకు ప్రోటోకాల్ దర్శనాలు కల్పిస్తున్న అదనపు ఈవో స్వామీజీలను కించపరిచేలా వ్యవహరించారని ఆరోపించారు స్వామీజీలు. అదనపు ఈవోగా వెంకయ్య చౌదరిని తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి.

ఇవి కూడా చదవండి

అధికారులపై స్వామీజీ ఆరోపణలు సరికాదంటోన్న టీటీడీ

శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద స‌ర‌స్వ‌తి టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదంటోంది. అడిగిన దర్శనం టిక్కెట్లు ఇవ్వలేదని తద్వారా మమ్మల్ని అవమానించారని ఆరోపించడం వాస్తవం కాదని ప్రకటన విడుదల చేసింది. 50 మందికి బ్రేక్ దర్శనం, 550 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు తిరుమలలో వసతి కల్పించాలని శ్రీనివాసానంద సరస్వతి టీటీడీ అధికారులను కోరారని పేర్కొంది. అయితే వారు అడిగిన మేరకు వసతి కల్పించేందుకు అంగీకరించామని, తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అంత మందికి ఇవ్వడం సాధ్యం కాదని అద‌న‌పు ఈవో చెప్పారని ప్రకటనలో పేర్కొంది. శ్రీనివాసనంద సరస్వతి 600 మందికి దర్శనం కల్పించాలని పట్టుబట్టారని.. అడిగినంత‌మందికి శ్రీ‌వారి ద‌ర్శ‌నం టిక్కెట్లు ఇవ్వ‌లేద‌న్న కోపంతోనే టీటీడీ అధికారులపై ఆరోపణలు చేస్తున్నారని టీటీడీ అంటోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
పచ్చగడ్డిపై చెప్పుల్లేకుండా నడవండి.. ఫలితం మీరే చూడండి వీడియో
పచ్చగడ్డిపై చెప్పుల్లేకుండా నడవండి.. ఫలితం మీరే చూడండి వీడియో
బందర్‌లో దృశ్యం మార్క్‌ క్రైమ్‌ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్
బందర్‌లో దృశ్యం మార్క్‌ క్రైమ్‌ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్
భారత్‌కు వచ్చేసిన స్టార్‌లింక్‌... మరింత చౌకగా హైస్పీడ్‌ ఇంటర్నెట
భారత్‌కు వచ్చేసిన స్టార్‌లింక్‌... మరింత చౌకగా హైస్పీడ్‌ ఇంటర్నెట
హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో
హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో
యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో
యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో
70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో