Tirumala: వడ్డీకాసుల వాడికి ఆగస్ట్ నెలలో కాసుల వర్షం.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ ఎన్ని కోట్ల ఆదాయం వచ్చిదంటే

ఇటీవల కాలంలో ఘననీయంగా స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. అందుకు తగ్గట్టుగానే హుండీ ఆదాయం కూడా రికార్డు స్థాయిలో నమోదు అవుతోంది. శ్రీవారికి భక్తులు భారీగా కానుకలు సమర్పిస్తూ తిరుమలేశుడి ఆస్తుల విలువను అమాంతంగా పెంచుతున్నారు. వెలకట్టలేని వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం కాగా ఈ ఏడాది మొదటి 7 నెలల హుండీ ఆదాయం రూ. 795.35 కోట్లుగా శ్రీవారి ఖాతాకు జమైంది.

Tirumala: వడ్డీకాసుల వాడికి ఆగస్ట్ నెలలో కాసుల వర్షం.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ ఎన్ని కోట్ల ఆదాయం వచ్చిదంటే
Tirumala Tirupati
Follow us

| Edited By: Surya Kala

Updated on: Sep 06, 2024 | 6:09 PM

తిరుమలేశుడి ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. ఈ ఏడాది మొదటి 7 నెలల్లో రూ 795.35 కోట్లకు చేరగా.. తిరుమల వెంకన్న ఆదాయం ఆగస్టు ఒక్క నెలలో రూ 125.67 కోట్లు వచ్చింది. దీంతో తిరుమల శ్రీవారికి 8 నెలల ఆదాయం కాస్తా రూ. 921.02 కోట్లకు చేరుకుంది. ఇటీవల కాలంలో ఘననీయంగా స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. అందుకు తగ్గట్టుగానే హుండీ ఆదాయం కూడా రికార్డు స్థాయిలో నమోదు అవుతోంది. శ్రీవారికి భక్తులు భారీగా కానుకలు సమర్పిస్తూ తిరుమలేశుడి ఆస్తుల విలువను అమాంతంగా పెంచుతున్నారు. వెలకట్టలేని వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం కాగా ఈ ఏడాది మొదటి 7 నెలల హుండీ ఆదాయం రూ. 795.35 కోట్లుగా శ్రీవారి ఖాతాకు జమైంది. ఈ ఏడాది జనవరిలో రూ 116.46 కోట్లు, ఫిబ్రవరిలో రూ 111.71 కోట్లు, మార్చి నెలలో రూ 118.49 కోట్లు, ఏప్రిల్ నెలలో రూ 101. 63 కోట్లు, మే నెలలో రూ 108.28 కోట్లు, జూన్ నెలలో రూ 113.64 కోట్లు, జులై నెలలో రూ 125.35 కోట్లు, ఆగష్టు నెలలో రూ 125.67 కోట్లు హుండీ కానుకలు శ్రీవారి ఆదాయంగా స్వామివారి ఖాతాకు చేరాయి. ఆగస్టు నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు, భక్తులు సమర్పించిన కానుకల వివరాలను తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈఓ శ్యామలరావు వెల్లడించారు.

ఆగస్టు నెలలో శ్రీవారిని 22.42 లక్షల మంది భక్తులు దర్శించుకోగా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 125.67 కోట్లు వచ్చినట్లు ఈఓ ప్రకటించారు. 1.06 లక్షల లడ్డూలను విక్రయించగా 24.33 లక్షల మంది ఒత్తులు అన్న ప్రసాదం స్వీకరించినట్లు చెప్పారు. ఆగస్టు నెలలో 9.49 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు ప్రకటించారు. ఇక టోకెన్లు లేని భక్తులకు ఆధార్ కార్డు లింక్ చేసి లడ్డూలు ఇవ్వడం వల్ల సాధారణ భక్తులకు మేలు జరుగిందన్నారు శ్యామల రావు. గత వారం రోజుల్లో 75 వేలకు పైగా లడ్డూలను వివిధ దేవాలయాలకు పంపించామని..టీటీడీ అనుబంధ ఆలయాలకు లడ్డూలను నిరంతరంగా పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి లడ్డూ నాణ్యత మెరుగు పడుతుందని, స్వామివారి నైవేద్యాల ప్రసాదాలు ఉడికి ఉడకనట్లు ఉన్నాయని పలు ఫిర్యాదులు వచ్చాయని ఇక నుంచి అది కూడా సరి చేసుకుంటామని తెలిపారు.

సేంద్రియ వ్యవసాయం బియ్యంలో పలు రకాల బియ్యం ఉందని పోటు కార్మికులు తమ దృష్టికి తీసుకొని వచ్చారన్నారు. స్వామివారి నైవేద్యాల ప్రసాదాలపై కమిటీని నియమించామని చెప్పారు. అక్టోబర్ లో జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రోజురోజుకీ పెరుగుతున్న వెంకన్న సంపద.. ఆగస్ట్ నెలలో ఎంత ఆదాయం అంటే
రోజురోజుకీ పెరుగుతున్న వెంకన్న సంపద.. ఆగస్ట్ నెలలో ఎంత ఆదాయం అంటే
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
హ్యూందాయ్ నుంచి కొత్త కారు లాంచ్.. ఆల్ బ్లాక్ థీమ్‌తో..
హ్యూందాయ్ నుంచి కొత్త కారు లాంచ్.. ఆల్ బ్లాక్ థీమ్‌తో..
తండ్రైన నితిన్.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన షాలిని
తండ్రైన నితిన్.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన షాలిని
చిన్నారులను వేటాడి పీక్కుతింటున్న తోడేళ్లు.. కారణం ఇదేనా..
చిన్నారులను వేటాడి పీక్కుతింటున్న తోడేళ్లు.. కారణం ఇదేనా..
మడమలపై పగుళ్ల సమస్యా.. ఇలా చేశారంటే ఈజీగా పోతాయి..
మడమలపై పగుళ్ల సమస్యా.. ఇలా చేశారంటే ఈజీగా పోతాయి..
ఒకేసారి నేల కూలిన 50వేలకుపైగా మహా వృక్షాలు.! మేడారంలో వింత ఘటన..
ఒకేసారి నేల కూలిన 50వేలకుపైగా మహా వృక్షాలు.! మేడారంలో వింత ఘటన..
హైదరాబాద్‌లో ఒక్కసారిగామారిన వాతావరణం..నిమిషాల్లో దంచికొట్టిన వాన
హైదరాబాద్‌లో ఒక్కసారిగామారిన వాతావరణం..నిమిషాల్లో దంచికొట్టిన వాన
లావణ్య చెప్పేవన్నీ నిజాలే అని తేల్చిన పోలీసులు
లావణ్య చెప్పేవన్నీ నిజాలే అని తేల్చిన పోలీసులు
కనిపిస్తే కాల్చి పడేయండి.! ఉత్తరప్రదేశ్‌ను వణికిస్తున్న తోడేళ్లు.
కనిపిస్తే కాల్చి పడేయండి.! ఉత్తరప్రదేశ్‌ను వణికిస్తున్న తోడేళ్లు.