AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మైహోమ్ ఇండస్ట్రీస్‌లో శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి తిరు కళ్యాణం.. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందజేసిన రామేశ్వరావు కుమారి దంపతులు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు స్వామివారి తిరు కళ్యాణం జరిగింది. అర్చకులు, వేద పండితులు ఉత్సవ మూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవను జరిపారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను తీసుకొచ్చి కల్యాణ తంతు చేపట్టారు. లక్ష్మీ సమేతుడైన వేంకటేశ్వరుడుని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరు కల్యాణ నిర్వహించారు. ముళ్లోకాది దేవతలు చూస్తుండగా స్వామి వారు శ్రీ, భూదేవి మెడలో మంగళ సూత్రధారణ చేశారు.

మైహోమ్ ఇండస్ట్రీస్‌లో శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి తిరు కళ్యాణం.. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందజేసిన రామేశ్వరావు కుమారి దంపతులు
Sri Venkateswara Swamy Kalyanam
Surya Kala
|

Updated on: Apr 05, 2024 | 9:28 AM

Share

సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని మైహోమ్ ఇండస్ట్రీస్‌లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి 26వ కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవాన్ని చూసి భక్తులు పునీతులయ్యారు. స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా వేద పండితుల మంత్రోచ్ఛారణలు, వేదపారాయణాలు, మంగళ వాయిద్యాల మధ్య జరిగింది.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు స్వామివారి తిరు కళ్యాణం జరిగింది. అర్చకులు, వేద పండితులు ఉత్సవ మూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవను జరిపారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను తీసుకొచ్చి కల్యాణ తంతు చేపట్టారు. లక్ష్మీ సమేతుడైన వేంకటేశ్వరుడుని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరు కల్యాణ నిర్వహించారు. ముళ్లోకాది దేవతలు చూస్తుండగా స్వామి వారు శ్రీ, భూదేవి మెడలో మంగళ సూత్రధారణ చేశారు.

ఆలయ తిరువీధుల ప్రాంగణం నమో వెంకటేష్, గోవిందా నామస్మరణతో మార్మోగింది. స్వామి అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు తమ జన్మ ధన్యమైందని భావిస్తూ ఆనంద పరవశులయ్యారు. సమస్త దేవతలు, మహర్షులు, ప్రకృతిలోని ప్రాణకోటి మొత్తం ఈ కల్యాణ వేడుకను తనివితీరా వీక్షించి పరవశించారన్నారు ఆహోబిలం పీఠాధిపతి రామానుజాచార్య.

ఇవి కూడా చదవండి

స్వామి అమ్మవార్ల కళ్యాణ తంతును శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి భక్తులకు ప్రవచించారు. లోక కల్యాణం, జగత్ రక్షణ కోసం జరిగిన ఈ కల్యాణికి ముందుగా గజవాహన సేవపై ఆలయ తిరువీధుల్లో ఉరేగించారు. స్వామివారి తిరు కల్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను మై హోమ్ ఇండస్ట్రీస్ చైర్మన్ జూపల్లి రామేశ్వరావు ,కుమారి దంపతులు అందజేశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ