AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్ర ప్రాముఖ్యత? ఎందుకు నిర్వహిస్తారు? ఈ ఏడాది ఎప్పుడంటే..

ప్రపంచ వాప్తంగా ప్రసిద్దిగాంచిన పూరీ జగన్నాథ రథయాత్ర సమయంలో.. జగన్నాథుడిని, ఆయన అన్నయ్య బాలభద్రుడిని, సోదరి సుభద్రను పూజిస్తారు. ఈ రథయాత్రను నిర్వహించడానికి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి కోసం ప్రతి సంవత్సరం ప్రత్యేక రథాలు నిర్మిస్తారు. అయితే జగన్నాథ రథయాత్ర ఈ ఏడాది ఎప్పుడు? అసలు ఈ సంప్రదాయం ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం..

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్ర ప్రాముఖ్యత? ఎందుకు నిర్వహిస్తారు? ఈ ఏడాది ఎప్పుడంటే..
Jagannath Rath Yatra
Surya Kala
|

Updated on: Jun 01, 2025 | 8:42 PM

Share

ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జగన్నాథ రథయాత్ర పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. జగన్నాథ రథయాత్రకు సన్నాహాలు దాదాపు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవంలో పాల్గొనడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. ఈ సమయంలో ఒడిశాలోని పూరి నగరంలో జన సందోహం నెలకొంటుంది. జగన్నాథ రథయాత్రలో పాల్గొనడం అత్యంత పుణ్యప్రదమైన కార్యక్రమంగా పరిగణించబడుతుంది.

వేద క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఈ జగన్నాథ రధయాత్ర ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష రెండవ రోజు నుంచి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు ఈ రథయాత్ర పండుగను 9 రోజులు జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం జగన్నాథ రథయాత్ర ఎప్పుడు జరుగుతుంది.. ? అసలు ఈ రధయాత్ర ఎలా ప్రారంభమైందో ఈ రోజు తెలుసుకుందాం..

2025 లో జగన్నాథ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది? వేద క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష రెండవ తేదీ జూన్ 26న మధ్యాహ్నం 1:25 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మరుసటి రోజు జూన్ 27న ఉదయం 11:19 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరం 2025 లో జగన్నాథ రథయాత్ర జూన్ 27 నుంచి ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

జగన్నాథ రథయాత్ర ఎందుకు నిర్వహిస్తారు? జగన్నాథ రథయాత్ర సమయంలో జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్ర దేవి రథంపై కూర్చుని నగరాన్ని పర్యటిస్తారు. మత విశ్వాసాల ప్రకారం ఈ రథయాత్ర సమయంలో రథంపై ఊరేగుతున్న జగన్నాథుడిని దర్శించుకోవడం వలన అన్ని దుఃఖాలు తొలగిపోతాయని, మరణానంతరం మోక్షాన్ని పొందుతారని నమ్మకం. పద్మ పురాణం ప్రకారం ఒకసారి సోదరి సుభద్ర తన సోదరుడు జగన్నాథుడితో నగరాన్ని చూడాలనే కోరికను వ్యక్తం చేసింది.

దీని తరువాత ఆషాడ మాసం శుక్ల పక్ష రెండవ రోజున జగన్నాథుడు తన సోదరుడు బాలభద్రుడిని , సోదరి సుభద్రను రథంపై కూర్చోబెట్టి మొత్తం నగరంలో పర్యటించాడు. దీని తరువాత ఈ ముగ్గురూ తమ మేనత్త ఇల్లు అయిన గుండిచా ఆలయానికి చేరుకున్నారు. అక్కడ వారు ఏడు రోజులు బస చేశారు. దీని తరువాత జగన్నాథుడు తన అన్న చెల్లితో కలిసి తన నివాసానికి తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి ఈ ప్రత్యేక సంప్రదాయం ప్రతి సంవత్సరం కొనసాగుతోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు