Pitru Paksha 2024: బ్రహ్మ హత్య పాపం నుంచి శివుడిని విముక్తి చేసిన తీర్ధం.. పూర్వీకులకు పిండ ప్రదానం చేయడం వలన పితృ దోషం తొలగిపోతుంది

గయ వలె, బ్రహ్మ కపాల తీర్థంలో నిర్వహించే పిండ ప్రధానం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ తీర్థయాత్రలో పిండ ప్రదానం చేయడం ద్వారా పూర్వీకుల ఆత్మలకు శాంతి, మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈ తీర్థయాత్రకు సంబంధించి అనేక ముఖ్యమైన నమ్మకాలు ఉన్నాయి. అందుకనే ఈ తీర్ధ యాత్ర హిందువులకు ముఖ్యమైన ప్రదేశంగా భావిస్తున్నారు. బ్రహ్మకపాల తీర్థం.. భక్తులు తమ పూర్వీకులకు పిండదానాన్ని అందించడం ద్వారా వారికి మోక్షాన్ని అందించే ప్రదేశం.

Pitru Paksha 2024: బ్రహ్మ హత్య పాపం నుంచి శివుడిని విముక్తి చేసిన తీర్ధం.. పూర్వీకులకు పిండ ప్రదానం చేయడం వలన పితృ దోషం తొలగిపోతుంది
Brahma Kapal Badrinath
Follow us

|

Updated on: Sep 20, 2024 | 10:59 AM

శ్రార్ధ కర్మలు, పిండ ప్రదానం అందించడం ద్వారా పితృ దోషం తొలగిపోతుందని హిందూ మతంలో నమ్ముతారు. గయ వలె, బ్రహ్మ కపాల తీర్థంలో నిర్వహించే పిండ ప్రధానం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ తీర్థయాత్రలో పిండ ప్రదానం చేయడం ద్వారా పూర్వీకుల ఆత్మలకు శాంతి, మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈ తీర్థయాత్రకు సంబంధించి అనేక ముఖ్యమైన నమ్మకాలు ఉన్నాయి. అందుకనే ఈ తీర్ధ యాత్ర హిందువులకు ముఖ్యమైన ప్రదేశంగా భావిస్తున్నారు. బ్రహ్మకపాల తీర్థం.. భక్తులు తమ పూర్వీకులకు పిండదానాన్ని అందించడం ద్వారా వారికి మోక్షాన్ని అందించే ప్రదేశం. బ్రహ్మకపాల తీర్థం ఉత్తరాఖండ్‌లోని చమోలిలోని నాలుగు ధాములలో ఒకటైన బద్రీనాథ్ ధామ్ సమీపంలో ఉంది.

బ్రహ్మకపాల తీర్థానికి సంబంధించిన నమ్మకాలు

  1. బ్రహ్మకపాల తీర్థానికి సంబంధించిన అతి ముఖ్యమైన నమ్మకం ఏమిటంటే.. ఇక్కడ పిండదానం చేయడం ద్వారా పూర్వీకులు మోక్షాన్ని పొందుతారని.
  2. కాశీలో చేసే పిండ ప్రదానం కంటే ఇక్కడ చేసే పిండ ప్రదానం ఎక్కువ ఫలవంతంగా పరిగణించబడుతుంది.
  3. పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలో బ్రహ్మ హత్య పాపం నుండి శివుడు విముక్తి పొందాడు. అందుకే ఈ ప్రదేశానికి బ్రహ్మకపాలం అని పేరు వచ్చింది.
  4. ఈ తీర్థయాత్ర చాలా ప్రశాంతమైనది. పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ క్షేత్రం పూర్వీకులకు కూడా శాంతిని అందించి వారిని ముక్తి మార్గంలో నడిపిస్తుందని విశ్వాసం.
  5. బ్రహ్మకపాలంలో ఉన్న చెరువు నీరు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నీటిలో స్నానం చేయడం, పిండ ప్రదానం చేయడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి అని చెబుతారు.

బ్రహ్మకపాల తీర్థం ప్రాముఖ్యత

బ్రహ్మకపాల తీర్థంలో శివునికి అంకితం చేయబడిన వివిధ రకాల పూజలు నిర్వహిస్తారు. బ్రహ్మ తలల్లో ఒక తలని శివుడు తన త్రిశులంతో ఖండించాడు. దీంతో శివుడికి బ్రహ్మ హత్య దోషం ఏర్పడింది. తన దోషాన్ని తొలగించుకోవడానికి శివుడు భూమి మీదకు దిగి వచ్చాడు. ఈ ప్రదేశంలో బ్రహ్మ హత్య దోషం నుంచి శివుడు విముక్తి పొందాడని నమ్ముతారు. కనుక ఇక్కడ శివుడిని పూజించడం విశేష ప్రాముఖ్యతను కలిగి ఉంది. బ్రహ్మకపాల తీర్థంలో అనేక రకాల యజ్ఞ యాగాలను కూడా నిర్వహిస్తారు. వాటిలో కొన్ని పూర్వీకులకు శాంతిని అందించడానికి, కొన్ని కుటుంబ సంతోషం కోసం చేస్తారు. ఇక్కడ చేసే ధ్యానం, యోగా వలన మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్మకం.

పిండ ప్రదానం ప్రాముఖ్యత

ఇవి కూడా చదవండి

పిండ ప్రదానం హిందూ మతంలో ఒక ముఖ్యమైన ఆచారం. ఇది ముఖ్యంగా పితృ పక్షంలో చేస్తారు. ఇది మన పూర్వీకులను భక్తితో స్మరించుకునే ప్రక్రియ. పిండ ప్రదానం చేయడం ద్వారా పూర్వీకులు సంతోషిస్తారని.. తమ వారసులపై దీవెనలు కురిపిస్తారని నమ్ముతారు. ఎవరైనా పితృదోషంతో ఇబ్బంది పడుతుంటే పితృ పక్షంలో చేసే శ్రద్ధ కర్మలు శుభ ఫలితాలను ఇస్తాయి.]

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి