అట్టహాసంగా స్వామినారాయణ ఆలయ ప్రారంభోత్సవం.. కళాకారులకు దక్కిన అరుదైన రాజ గౌరవం
జోధ్పూర్లోని కొత్త అక్షరధామ్ ఆలయం అత్యంత వైభవోపేతంగా ప్రారంభించబడింది. ఇది భారతదేశంలో మూడవ అక్షరధామ్ ఆలయం. ప్రపంచంలో ఐదవది. ఇది నాగర శైలిలో, ఇంటర్లాకింగ్ రాతి వ్యవస్థలో నిర్మించబడింది. ఇది 42 ఎకరాలలో విస్తరించి ఉన్న ఒక అద్భుతమైన మతపరమైన, పర్యాటక ప్రదేశం. ఈ క్రమంలోనే ఆలయ ప్రారంభోత్సవం సందర్బంగా ఆలయ నిర్మాణానికి సహకరించిన కళాకారులందరికీ విశేష గౌరవం దక్కింది.

రాజస్థాన్లోని జోధ్పూర్లో కొత్త అక్షరధామ్ ఆలయం అత్యంత వైభవంగా ప్రారంభించబడింది. సెప్టెంబర్ 25న గురు మహంత్ స్వామి మహారాజ్ స్వయంగా ఈ ఆలయాన్ని ప్రారంభించారు. ఇది భారతదేశంలో మూడవ అక్షరధామ్ ఆలయంగా, ప్రపంచంలో ఐదవదిగా నిలిచింది. ఇది నాగర శైలిలో, ఇంటర్లాకింగ్ రాతి వ్యవస్థలో నిర్మించబడింది. 42 ఎకరాలలో విస్తరించి ఉన్న ఒక అద్భుతమైన మతపరమైన, పర్యాటక ప్రదేశంగా ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకోనుంది. రాజస్థాన్లోని రెండవ అతిపెద్ద నగరంలో ఉన్న ఈ ఆలయం భక్తి, శాంతి, సాంస్కృతిక గర్వానికి కేంద్రంగా పరిగణించబడుతుంది. ఆలయ ప్రారంభోత్సవం సందర్బంగా ఆలయ నిర్మాణానికి సహకరించిన కళాకారులందరికీ విశేష గౌరవం దక్కింది.
కాలిబేరి సుర్సాగర్లో కొత్తగా నిర్మించిన స్వామినారాయణ ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఈ ఆలయం స్వామినారాయణ శాఖ స్థాపకుడు స్వామినారాయణుడికి అంకితం చేయబడింది. ఆయన నైతిక జీవితాన్ని, సామాజిక అభ్యున్నతిని ప్రబోధించారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన కళాకారులందరినీ పూజించడం, గౌరవించడం ఎంతో అవసరం అన్నారు గురు మహంత్ స్వామి మహారాజ్. సెప్టెంబర్ 25న గురు మహంత్ స్వామి మహారాజ్ స్వయంగా ఈ ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి కళాకారుడిని పూజించి గౌరవించాలనే కోరికను వ్యక్తం చేశారు.

Mahant Swami Maharaj
స్వామీజీ సూచనల మేరకు సెప్టెంబర్ 26న మధ్యాహ్నం 12:30 గంటలకు కళాకారుల గౌరవార్థం ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అన్ని వర్గాలకు చెందిన కళాకారులను గురూజీ సమక్షంలోనే రాజ గౌరవం ఇచ్చారు. ప్రతి కళాకారుడిని వేదికపైకి పిలిచి ముందుగా పూల దండలతో సత్కరించారు. తరువాత వారిని తలపాగా, తిలకంతో సత్కరించారు. సద్గురు సాధువులు వారికి వస్త్రాలు కప్పి, స్వీట్లు తినిపించారు. మహంత్ స్వామి మహారాజ్ అందరినీ ఆశీర్వదించారు. అక్కడ పని చేస్తున్న ప్రతి కళాకారుడితో ఫోటోలు దిగి వారిని సత్కరించారు.
ఈ సందర్బంగా శిల్పి ఉదయ్ సింగ్ మాట్లాడుతూ, ఇది నా జీవితంలో మరపురాని సంఘటనగా అభివర్ణించారు.. అలాంటి గౌరవాన్ని మనకు ఎవరు ఇవ్వగలరు అంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ రోజు మేమంతా నిజంగా సంతృప్తి చెందామని చెప్పారు.
మహంత్ స్వామీజీ మహారాజ్ వారిని ఆశీర్వాదిస్తూ..ఇలా అన్నారు.. మీరు చిన్నవారు కాదు. మీరు ఏ పని చేసినా, ఇక్కడ ఆలయంలో పనిచేసినందున మీరందరూ గొప్ప భక్తులు అయ్యారు. మీరు అన్ని అక్షరాల నుండి విముక్తి పొందారు. మీరందరూ ఏకాంత భక్తులు..నేను మీ అందరికీ సాష్టాంగ నమస్కారం చేసినా, అది తక్కువగానే ఉంటుంది అని అన్నారు.
ఇకపోతే, ఆలయ ప్రారంభోత్సవంలో భాగంగా సెప్టెంబర్ 27న సాయంత్రం శుభాకాంక్షల సమావేశం, సెప్టెంబర్ 28న సంస్కృతి దినోత్సవం జరుగుతాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..








