AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narasimha Jharni : ఈ క్షేత్ర దర్శనం.. మన దేశంలో ఉన్న అన్ని ఆలయాల కంటే భిన్నం, 600 మీటర్ల లోతు నీటిలో ప్రయాణం

భారత దేశం ఆధ్యాత్మిక నిలయం. రొటీన్ పనలకు స్వస్తి చెప్పి..మనస్సు ప్రశాంతత కోసం మనం విహార యాత్రలను.. చేస్తుంటాము.. కాగా ఈ విహార యాత్రాల్లో ఎక్కువగా ఆలయాలను ఎంచుకుంటాము. అలా తప్పని సరిగా...

Narasimha Jharni : ఈ క్షేత్ర దర్శనం.. మన దేశంలో ఉన్న అన్ని ఆలయాల కంటే భిన్నం, 600 మీటర్ల లోతు నీటిలో ప్రయాణం
Surya Kala
|

Updated on: Feb 27, 2021 | 5:49 PM

Share

Narasimha Jharni : భారత దేశం ఆధ్యాత్మిక నిలయం. రొటీన్ పనలకు స్వస్తి చెప్పి..మనస్సు ప్రశాంతత కోసం మనం విహార యాత్రలను.. చేస్తుంటాము.. కాగా ఈ విహార యాత్రాల్లో ఎక్కువగా ఆలయాలను ఎంచుకుంటాము. అలా తప్పని సరిగా దర్శించుకొనే ఆలయంలో ఒకటి ఝర్ణీ నరసింహక్షేత్రం.. క్రీ.పూ 400 ల ఏళ్ల క్రితం ఈ క్షేత్రం లో స్వామివారు కొలువై ఉన్నారు. ఈ క్షేత్ర దర్శనం.. మన దేశంలో ఉన్న అన్నీ ఆలయాల కంటే భిన్నమైనది.. ప్రత్యేకత కలిగి ఉన్నది.

బీదర్… కర్నాటక రాష్ట్రంలో మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక జిల్లా… చుట్టూ కొండలు, పచ్చని ప్రశాంతమైన వాతావరణం నడుమ బీదర్ కు దగ్గరలో ఉన్న మంగళ్ పేట్ లో నరసింహ క్షేత్రం వెలసింది. ఈ క్షేత్రం లో ఉండే స్వామికి జల నరసింహుడు అనే పేరు.. ఈ ఝరణీ నరసింహ స్వామిని దర్శించుకోవాలంటే… ఒక గుహ లో మనిషి లోతుగా ప్రవహించే నీటిలో నడుచుకుంటూ వెళ్ళాలి. అలా 600 మీటర్లు లోపలికి నీటిగుండా ప్రయాణం చేస్తే గుడి వస్తుంది.

జలనరసింహుడు అనే పేరు ఎలా వచ్చిందంటే…

శివుడు ఈ కొండ గుహలో తపస్సులో వుండగా జలాసుర అనే రాక్షసుడు సర్వ విధాల తపోభంగం కలిగించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నృసింహస్వామిగా అవతారమెత్తిన విష్ణు మూర్తి హిరణ్యకశిపుని ఖండించి అడవి ప్రాంతంలో సంచరిస్తుండగా శివుని వ్రత భంగం చూసి కోపోద్రిక్తుడై జలాసురుడిని నృసింహుడు ఖండించాడు. రాక్షసుడైనా కొద్దిగా చేసిన పుణ్యంతో నరసింహ స్వామి ఏదైనా ఒక మంచి కోరిక కోరుకో తీరుస్తానని అడగగా… జలసురుడు చివరి ఘడియలో నృసింహస్వామిని ఒక కోరిక కోరుకున్నాడు. నువ్వు ఇక్కడ వెలవాలి.. నిన్ను నా పేరుతో కలిసి పిలవాలి అదే వరంగా ఇవ్వమని జలసురుడు కోరాడట. జలసురుడి కోరిక తీర్చడం కోసం ఆ గుహలో వెలసిన నరసింహస్వామి అప్పటి నుంచి జలానరసింహుడి గా కొలవబడుతున్నాడు.

బీదర్ కు ఎలా చేరుకోవాలంటే..

హైదరాబాద్ నుంచి బీదర్ 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. మూడు గంటల ప్రయాణం. ఇక్కడకు చేరుకోవడానికి బస్సు, రైలు సదుపాయం కూడా కలదు.

బీదర్ కు గల పేర్లు:

మహాభారత కాలంలో విదూరానగరం, అహ్మద్ షా పరిపాలన కాలంలో అహ్మదాబాద్ బీదర్ గా మార్పు చెందింది.

Also Read:

: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం..

తీర్థయాత్రలకు వెళ్లేవారు తెలుసుకోవల్సిన విషయాలు.. శ్రీకృష్ణుడు పాండవులకు ఇచ్చిన సందేశంలోని అంతర్యాం..

బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్