AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Puran: గరుడ పురాణం ప్రకారం ఈ ఏడు విషయాలను పాటించడం ద్వారా జీవితంలో సుఖ సంతోషాలు మీ సొంతం..

హిందూ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. శ్రీ మహా విష్ణువు స్వయంగా మనిషి జీవన విధానం.. కర్మలకు అనుగుణంగా లభించే ఫలితాలను తన భక్తుడైన గరుత్మండికి వెల్లడించాడు. ఈ గరుడ నీతిలో ఏ పనులు చేయడం ద్వారా ఒక వ్యక్తి సంతోషకరమైన, సౌకర్యవంతమైన.. విజయవంతమైన జీవితాన్ని గడుపుతాడు చెప్పాడు. ఇలా జీవించిన వ్యక్తి మరణానంతరం అతను మోక్షాన్ని పొందుతాడని పేర్కొంది. ఈ రోజు మనిషి చేయాల్సిన 7 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం

Garuda Puran: గరుడ పురాణం ప్రకారం ఈ ఏడు విషయాలను పాటించడం ద్వారా జీవితంలో సుఖ సంతోషాలు మీ సొంతం..
Garuda Puranam
Follow us
Surya Kala

|

Updated on: May 09, 2025 | 3:06 PM

గరుడ పురాణం హిందూ మతంలోని 18 పురాణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. సాధారణంగా ఎవరైనా మరణించిన తర్వాత ఇంట్లో దీనిని పఠించాలని భావిస్తున్నారు. ఇందులో, జ్ఞానం, విధానం, ఆధ్యాత్మికం, సముద్ర శాస్త్రం, జ్యోతిషశాస్త్రం, ఆయుర్వేదం, జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలతో పాటు ఆత్మ, జననం, మరణం, స్వర్గం , నరకానికి సంబంధించినవి చెప్పబడ్డాయి. గరుడ పురాణం ప్రకారం కొన్ని రకాల విషయాలను పాటించడం ద్వారా సంతోషకరమైన విలాసవంతమైన, సంపన్నమైన జీవితాన్ని గడపవచ్చు. అవి ఏమిటో తెలుసుకుందాం..

విచక్షణ, అప్రమత్తత: గరుడ పురాణంలోని నీతిసార ప్రకారం మన శత్రువులను ఎదుర్కోవడానికి మనకు శక్తి కంటే అప్రమత్తత, విచక్షణ ఎక్కువగా అవసరం. ఎందుకంటే శత్రువులు మనకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అటువంటి పరిస్థితిలో మనం వివేకంతో తగినంత జాగ్రత్త వహించకపోతే మనం నష్టాలను చవిచూడవలసి రావచ్చు.

శుభ్రమైన, సువాసనగల దుస్తులను ధరించడం: గరుడ పురాణం శుభ్రమైన, చక్కని, సువాసనగల దుస్తులను ధరించడం గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే మురికి బట్టలు ధరించే వారికి అదృష్టం దూరంగా నిలుస్తుంది. లక్ష్మీ దేవి అలాంటి వారిపై కోపంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

జ్ఞాన సాధన: గరుడ పురాణం ప్రకారం, మూర్ఖుడు మాత్రమే కాదు, జ్ఞాని కూడా సాధన చేస్తూనే ఉండాలి. అప్పుడే ఒక వ్యక్తి ఉన్నత జ్ఞానంలో ప్రావీణ్యం పొందగలడు. నిరంతర సాధనతో మూర్ఖుడు కూడా జ్ఞానవంతుడు కాగలడని సాధన లేని జ్ఞానం నశించిపోతుందని అంటారు.

సమతుల్య ఆహారం: సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితానికి, ఒక వ్యక్తి సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఆహారం మన శరీరానికి ప్రధాన వనరు. దీని ద్వారా మనం వ్యాధి రహితంగా జీవించగలం. కనుక ఎల్లప్పుడూ సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినాలి.

ఏకాదశి ఉపవాసం: ఆధ్యాత్మిక గ్రంథాలతో పాటు గరుడ పురాణంలో కూడా ఏకాదశి ఉపవాసం వైభవం ప్రస్తావించబడింది. ఏకాదశి ఉపవాసం ఆచరించే వ్యక్తి ఇబ్బందులకు దూరంగా ఉంటాడు.

తులసి ప్రాముఖ్యత: గరుడ పురాణంతో పాటు తులసి ప్రాముఖ్యతను అనేక పురాణాలలో కూడా ప్రస్తావించారు. ఇంట్లో తులసి మొక్క ఉండటం వల్ల సానుకూలత వస్తుంది. వ్యాధులు, దోషాలను దూరంగా ఉంచుతుంది. విష్ణు పూజలో తులసిని సమర్పించడం ద్వారా ఆశించిన ఫలితాలు లభిస్తాయి.

దేవాలయాలు, మతం పట్ల గౌరవం: మతాన్ని, దేవుళ్లను, దేవతలను, మతపరమైన ప్రదేశాలను, మత గ్రంథాలను ఎప్పుడూ అవమానించకూడదు. అలాంటి వారు నేరుగా నరకానికి వెళతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.