AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గరుడ పురాణం ప్రకారం మరణానికి ముందు కనిపించే రహస్య ద్వారం ఏంటి..?

గరుడ పురాణం హిందూ ధర్మంలోని 18 మహాపురాణాలలో ఒకటి. ఇది విష్ణువుకు అంకితం చేయబడింది. ఇందులో మరణానికి ముందు కనిపించే సూచనలు, మరణానంతర ఆచారాల గురించి వివరిస్తారు. పితృ దేవతల దర్శనం, నీడ కనిపించకపోవడం, రహస్య ద్వారం, యమదూతల దర్శనం వంటి లక్షణాలు మరణాన్ని సూచిస్తాయని చెపుతుంది.

గరుడ పురాణం ప్రకారం మరణానికి ముందు కనిపించే రహస్య ద్వారం ఏంటి..?
Garuda Purana
Prashanthi V
|

Updated on: Feb 17, 2025 | 11:46 AM

Share

గరుడ పురాణం ప్రకారం.. వ్యక్తి మరణించిన తర్వాత 13 రోజుల పాటు గరుడ పురాణం చదవడం ద్వారా ఆత్మకు శాంతి కలుగుతుందని నమ్ముతారు. గరుడ పురాణం పఠించడానికి శుభ్రమైన దుస్తులు ధరించడం, ఏకాగ్రతతో ఉండటం వంటి నియమాలు పాటించాలి. దీనివల్ల భయాలను తొలగించుకొని జీవిత సత్యాన్ని గ్రహించవచ్చు. అంతేకాకుండా మరణానికి ముందు వ్యక్తికి కనిపించే కొన్ని సూచనల గురించి కూడా ఇందులో వివరించబడింది. ఈ సూచనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పితృ దేవతల దర్శనం

గరుడ పురాణంలో మరణం సమీపంలో ఉన్న వ్యక్తికి అతని పితృ దేవతలు కనిపిస్తారని చెప్పబడింది. పితృ దేవతలను చూడటం మరణం దగ్గరలో ఉందనడానికి ఒక సంకేతంగా పరిగణించబడుతుంది. ఇది పూర్వీకులతో అనుసంధానాన్ని సూచిస్తుంది.

నీడ కనిపించకపోవడం

వ్యక్తి మరణించే ముందు కొన్ని అశుభ సంకేతాలు కనిపిస్తాయని గరుడ పురాణం చెబుతుంది. వాటిలో ముఖ్యమైనది నీడ కనిపించకపోవడం. నూనె, నెయ్యి, నీరు లేదా అద్దంలో తమ నీడను చూడలేకపోవడం మరణానికి సూచనగా భావిస్తారు.

రహస్యమైన ద్వారం

మరణానికి కొన్ని క్షణాల ముందు వ్యక్తికి ఒక రహస్యమైన ద్వారం కనిపిస్తుందట. గరుడ పురాణం ప్రకారం ఆ ద్వారం నుండి ప్రకాశవంతమైన తెల్లటి కాంతి కిరణాలు వస్తాయి. ఇది మరణానికి చేరువలో ఉన్నట్లు సూచిస్తుంది.

యమదూతల దర్శనం

గరుడ పురాణం ప్రకారం మరణానికి కొంత సమయం ముందు వ్యక్తి యమదూతలను చూస్తాడు. యమదూతలను చూడటం అంటే మరణం ఆసన్నమైందని అర్థం.

గరుడ పురాణం ఎప్పుడు పఠిస్తారు..?

ఎవరైనా మరణించిన తర్వాత గరుడ పురాణాన్ని పఠిస్తారు. మరణించిన వ్యక్తి ఆత్మ 13 రోజుల పాటు ఇంట్లోనే ఉంటుందని నమ్ముతారు. అందుకే గరుడ పురాణం పఠించడం వల్ల ఆత్మకు శాంతి కలుగుతుంది.

గరుడ పురాణ పఠన నియమాలు

  • గరుడ పురాణాన్ని భక్తితో, నిజమైన మనస్సుతో చదవాలి.
  • గరుడ పురాణాన్ని ఇంట్లో ఉంచకూడదు. ప్రత్యేక స్థానంలో ఉంచాలి.
  • గరుడ పురాణాన్ని పఠించేటప్పుడు శుభ్రమైన దుస్తులు ధరించాలి.
  • గరుడ పురాణాన్ని పఠించేటప్పుడు ఎవరి గురించి చెడుగా ఆలోచించకూడదు.
  • పఠనం చేసేటప్పుడు ఏకాగ్రతతో ఉండాలి.

ఈ నియమాలను పాటించడం వల్ల గరుడ పురాణం ఫలాన్ని పొందవచ్చు. గరుడ పురాణం మరణం గురించి మనకున్న భయాలను తొలగించి జీవితపు సత్యాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది.