Tirumala: బ్రహోత్సవాల కోసం తిరుమలకు వెళ్లే భక్తులకు అలెర్ట్.. తిరుమల గిరిపై ఈ నిబంధనలు తప్పని సరి.. అవి ఏమిటో తెలుసా..

క‌రోనా కార‌ణంగా రెండేళ్ల త‌రువాత మాడ వీధుల్లో శ్రీ‌వారి బ్రహ్మోత్సవ వాహ‌న‌సేవ‌లు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సామాన్య భ‌క్తుల‌కు పెద్దపీట వేస్తూ స‌ర్వదర్శనం మాత్రమే అమలు చేయనున్నారు.

Tirumala: బ్రహోత్సవాల కోసం తిరుమలకు వెళ్లే భక్తులకు అలెర్ట్.. తిరుమల గిరిపై ఈ నిబంధనలు తప్పని సరి.. అవి ఏమిటో తెలుసా..
Annual Brahmotsavams
Follow us

|

Updated on: Aug 08, 2022 | 11:38 AM

Tirumala: తిరుమల తిరుపతి క్షేత్రంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 27 వ తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. రెండున్నరేళ్ల తర్వాత స్వామి వారి బ్రహ్మోత్సవాలు నాలుగు మాడ వీధుల్లో నిర్వహిస్తుండటం విశేషం. పెరటాశి మాసం రావడంతో భక్తులు భారీగా వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు. రద్దీకి తగ్గట్టు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని సుబ్బారెడ్డి చెప్పారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు మాస్క్ తప్పని సరిగా ధరించాలని సూచించారు. తిరుమల, అలిపిరిలో భక్తుల కోసం తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేస్తామన్నారు. సీఎం జగన్ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పించనున్నారు.

బ్రహ్మోత్సవాలు:  సెప్టెంబ‌రు 26న‌ అంకురార్ప. సెప్టెంబ‌రు 27న సాయంత్రం 5.45 నుండి 6.15 గంట‌ల మ‌ధ్య మీన ల‌గ్నంలో ధ్వజారోహ‌ణం. సెప్టెంబర్ 27న సాయంత్రం సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ‌. అక్టోబరు 1న గరుడ సేవ, 2న స్వర్ణర‌థం, 4న రథోత్సవం, 5న చక్రస్నానం.

క‌రోనా కార‌ణంగా రెండేళ్ల త‌రువాత మాడ వీధుల్లో శ్రీ‌వారి బ్రహ్మోత్సవ వాహ‌న‌సేవ‌లు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిరోజు ధ్వజారోహ‌ణం కార‌ణంగా రాత్రి 9 గంట‌ల‌కు పెద్దశేష వాహ‌నసేవ.. మిగ‌తా రోజుల్లో ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

సామాన్య భ‌క్తుల‌కు పెద్దపీట వేస్తూ స‌ర్వద‌ర్శనం మాత్రమే అమ‌లు చేయనున్నారు. ఆర్జిత సేవ‌లు, శ్రీ‌వాణి, విఐపి బ్రేక్ ద‌ర్శనాలు, రూ.300/- ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనం, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల త‌ల్లిదండ్రుల‌కు ప్రత్యేక ద‌ర్శనం త‌దిత‌ర ప్రివిలేజ్డ్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. పెర‌టాసి మాసం.. రెండో శ‌నివారం నాడు గ‌రుడ‌సేవ రావ‌డంతో ర‌ద్దీకి అనుగుణంగా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు విరివిగా అన్న ప్రసాదం అందించడానికి అవసరమైన ఏర్పాట్లు. భక్తుల రద్దీకి తగ్గట్టు ప్రతిరోజూ 9 ల‌క్షల లడ్డూలు పంపిణీ కి ఏర్పాటు చేస్తున్నారు.

సెక్యూరిటీ, పోలీసుల స‌మ‌న్వయంతో బందోబ‌స్తు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ మొత్తం రింగ్ రోడ్డులో చేసి , భక్తులను ఉచిత బస్సుల ద్వారా వివిధ ప్రాంతాలకు తరలించనున్నారు. 24/7 కంట్రోల్ రూమ్‌, సిసి కెమెరాలతో నిఘా. గ్యాల‌రీలు, క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. అలిపిరి వ‌ద్ద ద్విచ‌క్ర వాహ‌నాలు, నాలుగు చ‌క్రాల వాహ‌నాల‌కు ప్రత్యేకంగా పార్కింగ్ సౌక‌ర్యం. నిరంత‌రాయంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా కోసం తిరుమల గిరులపై జ‌న‌రేట‌ర్లు సిద్ధం చేశారు. శ్రీ‌వారి ఆల‌యం, అన్ని ముఖ్య కూడ‌ళ్లలో ఆక‌ట్టుకునేలా విద్యుత్ దీపాలంక‌ర‌ణ‌లను చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 3,500 మంది శ్రీ‌వారి సేవ‌కులు పాల్గొననున్నారు.

భక్తుల కోసం ఎగ్జిబిష‌న్‌, మీడియా సెంట‌ర్ ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారనే అంచనాతో ప‌రిశుభ్రత‌కు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు సుబ్బారెడ్డి.  5 వేల మంది పారిశుద్ధ్య కార్మికుల‌ను అద‌నంగా ఏర్పాటు చేశారు. తిరుపతిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్పెష‌లిస్టు డాక్టర్లు, ప్రథ‌మ చికిత్స కేంద్రాలను అందుబాటులోకి తీసుకుని రానున్నారు. 10 ప్రత్యేక అంబులెన్సుల ఏర్పాటు. ఎపిఎస్ఆర్‌టిసి ద్వారా త‌గిన‌న్ని బ‌స్సులను ఏర్పాటు చేస్తున్నారు. గ‌రుడ‌సేవ రోజున అదనంగా బస్సులు ఏర్పాటు చేయనున్నారు. తిరుప‌తి ఘాట్ రోడ్లలో గ‌రుడ‌సేవ నాడు పూర్తిగా, మ‌రుస‌టి రోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ద్విచ‌క్ర వాహ‌నాల రాక‌పోక‌ల నిషేధం విధించినట్లు తెలిపారు. కొండ మీద వాహనాల రద్దీ ని బట్టి అవసరమైతే అలిపిరిలో వాహనాల నియంత్రణ  చేపట్టనున్నామని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు