Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం దేశంపై దాడి లేదా సంక్షోభం తలెత్తితే పౌరుడిగా మీరు ఏం చేయాలో తెలుసా
ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో మనిషి జీవన విధానం గురించి మంచి చెడుల ప్రవర్తన గురించి మాత్రమే కాదు దేశాన్ని పాలించే విధానం గురించి కూడా చెప్పాడు. పాలకుల లక్షణాలు.. ప్రజల విధులు గురించి నీతి శాస్త్రంలో వెల్లడించాడు. చాణక్య నీతిలో దేశంలో అత్యవసర పరిస్థితి గురించి, యుద్ధం , దాడి మొదలైన వాటి గురించి కూడా అనేక విషయాలు వెల్లడించాడు. అంతేకాదు ఇటువంటి సమయంలో పౌరుడిగా మీరు ఏమి చేయాలో కూడా చెప్పాడు

జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత దేశంలో దుఃఖంతో పాటు కోపం కూడా వెల్లువిరుస్తోంది. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ప్రతిచోటా ఉంది. దీని తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దేశంలో ఇటువంటి పరిస్థితిలు తలెత్తితే పౌరుడిగా మీరు ఏమి చేయాలో ఆచార్య చాణక్యుడు తన విధానాలలో వివరంగా వివరించారు.
జీవితంలో మలుపు తిరిగేటప్పుడు మంచి, చెడు అనే అనేక పరిస్థితులు వస్తాయి. అయితే కొన్ని ఆకస్మిక పరిస్థితులు జీవితాన్ని కుదిపేస్తాయి. ఆచార్య చాణక్యుడు తన విధానాలలో శ్లోకాల ద్వారా అనేక జీవన విధానాలను చెప్పాడు, వాటిలో ఒకటి దేశంలో హింస, ఉద్రిక్తత లేదా దాడి వంటి వాతావరణంలో పౌరుడిగా మీ విధులు ఏమిటి. దేశంలో దాడి లేదా సంక్షోభ పరిస్థితి తలెత్తితే మీరు ఏమి చేయాలి. దీనితో పాటు దేశ సౌభాగ్యాన్ని పాడు చేసే (ఉగ్రవాదుల వంటి) దుష్ట వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలో కూడా చాణక్యుడు చెప్పాడు.
ఆచార్య చాణక్యుడు దుష్ట ఆలోచనలున్న వ్యక్తులు .. ముళ్ళు ఒకటే అని చెప్పాడు. దుష్ట ఆలోచనలున్న వ్యక్తులను వదిలించుకోవడానికి.. వారిని సమూలంగా నిర్మూలించండి.. వారిని అణిచివేయండి లేదా వారి నుంచి దూరంగా వెళ్లండి. అంతేకాని.. నాకు ప్రమాదం లేదు కదా అంటూ దుష్ట వ్యక్తులతో ఏదైనా సంబంధం పెట్టుకోవడం మీకు హానికరం. పహల్గామ్ ఉగ్రవాద దాడి సందర్భంలో చాణక్యుడి చెప్పిన ఈ నియమాన్ని మనం పరిశీలిస్తే, దాడి తర్వాత పరిస్థితి ప్రకారం.. ముళ్ళ వంటి గుణం కలిగి సమాజంలో చీడ పురుగుగా మారిన ఉగ్రవాదులను అణిచివేయాలి.
చాణక్యుడు తన విధానంలో మనకు మంచి చేసేవారికి మనం మంచి చేయాలి, హింసాత్మకు ప్రతీకారం తీర్చుకోవాలి. దుర్మార్గులకు చెడు చేయాలి అని చెప్పాడు. ఈ నీతి ప్రకారం పహల్గామ్ ఉగ్రవాద దాడి సందర్భంలోఉగ్రవాదుల హింస, హత్య, క్రూరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని వారిని నిర్మూలించడానికి కూడా మనం అదే విధంగా స్పందించాలి.
చాణక్యుడు ప్రకారం ఎవరైనా సరే నెమ్మది తనం..సూటిగా మాట్లాడే గుణం కలిగి ఉండవద్దు. సరళంగా ఉండకూడదని చెప్పాడు. ఎందుకంటే అడవిలో నిటారుగా ఎదిగిన ఉన్న చెట్లను మొదటగా నరికివేస్తారు. అదే సమయంలో వంకరగా ఉన్న చెట్లను వదిలివేస్తారు. దీని అర్థం ఎవరైనా సరళ స్వభావాన్ని కలిగి వ్యక్తులను చాలా ఈజీగా చెడు పనులకు చేసే విధంగా చాలా సులభంగా ఉపయోగించుకుంటారు. అయితే తెలివైన, చాకచక్యమైన వ్యక్తి రానున్న సంక్షోభాన్ని ముందుగానే పసిగట్టగలడు. పరిస్థితికి అనుగుణంగా తనని తాను మలచుకుంటాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.