Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Subramanya Shashti: ఘనంగా సుబ్రమణ్య షష్ఠి వేడుకలు.. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మరథోత్సవం..భారీగా పాల్గొన్న భక్తులు

చంపా షష్టి సందర్భంగా క్షేత్ర దైవం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మరథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రథసారధి కుక్కే సుబ్రహ్మణ్యుడిని రథంపై ఊరేగించారు. లక్షలాది మంది భక్తులు రథోత్సవాన్ని తిలకించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు

Subramanya Shashti: ఘనంగా సుబ్రమణ్య షష్ఠి వేడుకలు.. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మరథోత్సవం..భారీగా పాల్గొన్న భక్తులు
Kukke Subramanya Champa Sha
Follow us
Surya Kala

|

Updated on: Nov 29, 2022 | 4:53 PM

శివుని కుమారుడు సుబ్రహ్మణ్యస్వామికి దేవసేనతో అత్యంత వైభవంగా వివాహం జరిగిన రోజుని “శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి” గా పరిగణిస్తారు.  నాగ దోష నివారణకు, సంతాన లేమి, జ్ఞాన వృద్ధికీ, కుజ దోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు. స్కంద పంచమి, షష్ఠి రోజుల్లో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం లభిస్తుందని  స్కాంద పురాణం చెబుతున్నది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో షష్టి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం చంపా షష్టి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. చంపా షష్టి సందర్భంగా క్షేత్ర దైవం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మరథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రథసారధి కుక్కే సుబ్రహ్మణ్యుడిని రథంపై ఊరేగించారు. లక్షలాది మంది భక్తులు రథోత్సవాన్ని తిలకించారు. ఉదయం 7.05 గంటలకు వృశ్చిక లగ్నంలో సుబ్రహ్మణ్యుడి విగ్రహ బ్రహ్మరథారోహణం జరిగింది. ఉమామహేశ్వర స్వామి చిన్న రథంలో కూర్చున్నాడు. చిక్క రథోత్సవం అనంతరం చంపాషష్ఠి మహారథోత్సవం నిర్వహించారు. కోవిడ్‌ ఆంక్షల కారణంగా గత రెండేళ్లుగా బ్రహ్మరథోత్సవంలో ఎక్కువ మంది భక్తులు పాల్గొనలేకపోయారు.

ఆలయంలో వెండి రథోత్సవం నేపథ్యంలో నేడు స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించనున్నారు. ఆలయ సమీపంలో ముస్లిం వ్యాపారులకు అవకాశం లేదు అన్న బ్యానర్ వివాదానికి కారణం అయింది. ఈ నేపథ్యంలో పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.

ఇవి కూడా చదవండి

కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో జరిగే చంపాషష్ఠిలో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. జాతర నేపథ్యంలో ఆలయాన్ని పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపలతో అందంగా అలంకరించారు. రథోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరగకుండా ముందస్తుగా రథం లాగేవారికి పాస్ లు అందజేశారు.

ఆలయంలో వివిధ సేవలు చేసిన వారికి ప్రసాదంగా ఒక చెరుకు ముక్కను అందజేస్తారు. భక్తుల మధ్య చెరకు ప్రసాదం కోసం పోటీ ఉండకూడదని.. భక్తులకు ఇచ్చేందుకు చెరకు ప్రసాదం కొరత ఉండకూడదనే ఉద్దేశంతో ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

కరోనా సందర్భంగా జలస్నానంపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. అయితే చంపాషష్టి జాత్రా మహోత్సవాల సందర్భంగా భక్తుల స్నానాలకు  అనుమతించారు. ఆలయ ప్రాంగణం చుట్టూ ఆకులను చుట్టి, ఆవులు ప్రసాదం తిన్న తర్వాత భక్తులు వాటిని చుట్టుకుని  స్నానం చేశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..