AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Ram Mandir: నేడు అయోధ్య రామయ్యకు జలాభిషేకం .. పాక్ సహా వివిధ దేశాల నదుల నుంచి జలం సేకరణ..

ఉజ్బెకిస్థాన్, పాకిస్థాన్, చైనా సహా ప్రపంచంలోని అనేక దేశాల నుంచి దాదాపు 155 నదుల నుంచి సేకరించిన నీరు ఢిల్లీ నుంచి రామ జన్మ భూమి అయోధ్యకు చేరింది. ఈ నదుల నీటితో నేడు రామ్ లల్లా 'జలాభిషేకం' నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి యోగి. 

Ayodhya Ram Mandir: నేడు అయోధ్య రామయ్యకు జలాభిషేకం .. పాక్ సహా వివిధ దేశాల నదుల నుంచి జలం సేకరణ..
Ayodhya Ram Mandir
Surya Kala
|

Updated on: Apr 23, 2023 | 8:52 AM

Share

కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడు కొలువుదీరనున్న అయోధ్యలో సందడి నెలకొంది. సరయు నది తీరంలో కొలువైన రామయ్యకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు నేడు జలాభిషేకం నిర్వహించనున్నారు. మణిరామ్ దాస్ చావ్నీ ఆడిటోరియంలో జరగనున్న ఈ వేడుకలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బృందం నుండి ‘జల్ కలష్’ని స్వీకరించిన అనంతరం రామయ్యను ఆ నీటితో పూజిస్తారు.

ఈ జలాభిషేకం కోసం రామభక్తుడు విజయ్‌ జొలీ నేతృత్వంలోని బృందం వివిధ  దేశాల్లోని అనేక నదుల నుంచి జలాన్ని సేకరించారు. ఇప్పటికే ఆయా నదుల జలాన్ని సీఎం యోగికి అందించారు. ప్రపంచ దేశాల నదుల నుంచి తీసుకొచ్చిన ఈ పవిత్ర జలం పాత్రల వద్ద ఆయా దేశాల జెండాలు, వాటి పేర్లు, నదుల పేర్లతో కూడిన స్టిక్కర్లు ఉంటాయి. ఈ కార్యక్రమంలో పలు దేశాల రాయబారులు కూడా పాల్గొంటారు.

ఉజ్బెకిస్థాన్, పాకిస్థాన్, చైనా సహా ప్రపంచంలోని అనేక దేశాల నుంచి దాదాపు 155 నదుల నుంచి సేకరించిన నీరు ఢిల్లీ నుంచి రామ జన్మ భూమి అయోధ్యకు చేరింది. ఈ నదుల నీటితో నేడు రామ్ లల్లా ‘జలాభిషేకం’ నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి యోగి.

ఇవి కూడా చదవండి

భారత్ కు పొరుగు దేశాలైన నేపాల్, బాంగ్లాదేశ్ సహా అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ, టాంజానియా, నైజీరియా,  బ్రిటన్‌, భూటాన్‌, మాల్దీవులు వంటి అనేక దేశాల్లోని నదులతో పాటు అంటార్కిటికా నుంచి కూడా నీటిని సేకరించి.. భారత్ కు రప్పించినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ చెప్పారు.

ఈ జలాల్లో పాకిస్థాన్ లో ప్రవహిస్తున్న రావి నది జలం కూడా ఉంది. ఈ నది నీటిని పాకిస్థాన్ లోని హిందువులు సేకరించి.. దుబాయ్ కు పంపించారు. అక్కడ నుంచి ఢిల్లీకి చేరుకుంది. అక్కడ నుంచి ఆ జలం అయోధ్యకు చేరుకుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్