AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashadha Purnima: డబ్బుకి ఇబ్బంది పడుతున్నారా.. ఆషాడ పౌర్ణమి రోజున ఇలా చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం..

ఆషాఢ మాసంలోని పౌర్ణమిని గురు పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజున వ్యాస మహర్షి జన్మించిన రోజుగా భావిస్తారు. ఈ ఏడాది ఆషాఢ మాసంలో పౌర్ణమి తిధి జూలై 10వ తేదీన వచ్చింది. ఈ పౌర్ణమి తిథి రోజున శ్రీ మహా విష్ణువు, లక్ష్మీ దేవిని పూజించడంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆర్థిక ప్రయోజనాలను పొందడానికి ఈ రోజున ఏ చర్యలు చేయడం ఫలవంతమో ఈ రోజు తెలుసుకోండి.

Ashadha Purnima: డబ్బుకి ఇబ్బంది పడుతున్నారా.. ఆషాడ పౌర్ణమి రోజున ఇలా చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం..
Ashadha Purnima 2025
Surya Kala
|

Updated on: Jul 07, 2025 | 2:22 PM

Share

హిందూ మతంలో పౌర్ణమి తిధికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున రోజున స్నానం చేయడం, దానం చేయడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ రోజున శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం జీవితంలో ఆనందం, అదృష్టం పొందడానికి పూజిస్తారు. అటువంటి పరిస్థితిలో ఆషాఢ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడానికి మీరు కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయవచ్చు. ఈ చర్యలు చేయడం ద్వారా డబ్బు కొరత నుంచి గృహ సమస్యల వరకు అన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం.

కలహాల నుంచి బయటపడేందుకు: ఎవరి ఇంట్లోనైనా తరచుగా గొడవలు జరుగుతుంటే.. ఆషాఢ పున్నమి రోజున శ్రీ మహా విష్ణువు, లక్ష్మీ దేవిని పూర్తి ఆచారాలతో పూజించండి. పూజ సమయంలో విష్ణువుకు తెల్ల గంధపు తిలకం దిద్ది ఇంట్లో శాంతి, ఆనందం కోసం ప్రార్థించండి. పున్నమి రోజున ఇంట్లో దీపం వెలిగించడం వల్ల కూడా సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.

డబ్బుకి ఇబ్బంది పడుతుంటే: ఆషాఢ పున్నమి రోజున లక్ష్మీ దేవిని పూజించి మందారం పువ్వులు, గులాబీ, కలువ పువ్వులు వంటి ఎర్రటి పువ్వులను సమర్పించండి. అలాగే బియ్యంతో చేసిన ఖీర్‌ను భోగంగా అర్పించాలి. ఈ రోజున కనకధార స్తోత్రాన్ని కూడా పఠించాలి. ఇలా చేయడం ద్వారా ఎవరైనా డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యల నుంచి బయటపడతాడని మత విశ్వాసం.

ఇవి కూడా చదవండి

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం: ఆషాఢ పౌర్ణమి రోజున.. గోమాత పూజ చేయండి. లక్ష్మీదేవి గా భావించి 11 గోవులకు లేదా గోవు ఉన్న విగ్రహాలకు పసుపు రాసి పూజ చేయండి. తరువాత లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీ చాలీసా పఠించండి. పూజ తర్వాత ఈ గోవులను మీ భద్రంగా ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయని, లక్ష్మీదేవి సంతోషిస్తుందని విశ్వాసం.

ప్రతికూల శక్తిని తొలగించండి: ఆషాఢ పూర్ణిమ రోజున ఇంట్లో సత్యనారాయణ కథ పఠనం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ఇంటి నుండి ప్రతికూలతను తొలగిస్తుందని, జీవితంలో ఆనందం, శ్రేయస్సు ప్రబలుతుందని మత విశ్వాసం. అటువంటి పరిస్థితిలో ఆషాఢ పౌర్ణమి రోజున ఇంట్లో సత్యనారాయణ కథను చదవం వినడం శుభప్రదం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.