AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttam Kumar Reddy : కరోనా వేళ ప్రైవేట్ హాస్పిటల్స్ స్వాధీనం చేసుకుని ప్రజలకు ఉచిత వైద్యం అందించండి : ఉత్తమ్ కుమార్ రెడ్డి

Private Hospitals : కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోన్న వేళ ప్రైవేటు ఆసుపత్రులను స్వాధీనం చేసుకుని తెలంగాణ ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు...

Uttam Kumar Reddy : కరోనా వేళ ప్రైవేట్ హాస్పిటల్స్ స్వాధీనం చేసుకుని ప్రజలకు ఉచిత వైద్యం అందించండి : ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy
Venkata Narayana
|

Updated on: May 16, 2021 | 4:02 PM

Share

Private Hospitals : కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోన్న వేళ ప్రైవేటు ఆసుపత్రులను స్వాధీనం చేసుకుని తెలంగాణ ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. పక్క రాష్ట్రాలలో ప్రైవేట్ హాస్పిటల్స్‌ను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకొని ఉచితంగా వైద్యం అందిస్తుంటే.. తెలంగాణలో మాత్రం దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ మాత్రం అటు ఆయుష్మాన్ భారత్ కానీ, ఆరోగ్య శ్రీ కానీ అమలు చేయడం లేదని మండిపడ్డారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనాకు ప్రైవేట్ హాస్పిటల్స్ స్వాధీనం చేసుకుని ఉచితంగా వైద్యం అందిస్తుంటే తెలంగాణలో మాత్రం ప్రయివేటు ఆస్పత్రులు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఫైరయ్యారు. అంతేకాదు, కరోనా నివారణకు మందులు, ఆక్సిజన్, బెడ్స్, వెంటిలేటర్లు అసలే లభించడంలేదని, డబ్బులు పెట్టినా బెడ్స్ లేవని,ఈ క్రమంలో పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశంలో హైదరాబాద్ మెడికల్ హబ్ గా ఉందని.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రోత్సాహకాలతో అనేక ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు హైదరాబాద్ కు వచ్చాయని ఉత్తమ్ అన్నారు. రెమిడిసివర్ మందు హెటిరో కంపెనీ హైదరాబాద్ లో తయారు చేస్తుందని, ఆ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పించిందని అయినా… మనకు రెమిడెసివర్ ఇంజక్షన్లు లభించడం లేదని ఆయన విమర్శించారు.

Read also :  Kshatriya : ఎంపీ రఘురామకృష్ణరాజుకు మద్దతివ్వడంలేదని తేల్చిచెప్పిన క్షత్రియ సేవా సమితి.. ఆ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని స్పష్టీకరణ

Follow Us
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
విద్యార్ధులకు అలర్ట్.. జూలై 6 నుంచి 19వరకు స్కూళ్లకు వరుస సెలవులు
విద్యార్ధులకు అలర్ట్.. జూలై 6 నుంచి 19వరకు స్కూళ్లకు వరుస సెలవులు
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు