AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆదివారాల్లో సైతం రిజిస్ట్రేషన్లు.. పెండింగ్‌ పనులు పూర్తయ్యేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు

రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ ద్వారా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు క్లియర్ అయ్యేలా గత రెండు నెలలుగా మంచి సేవలు అందిస్తున్నందుకు రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బందిని..

ఆదివారాల్లో సైతం రిజిస్ట్రేషన్లు.. పెండింగ్‌ పనులు పూర్తయ్యేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు
K Sammaiah
|

Updated on: Mar 04, 2021 | 7:00 PM

Share

రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ ద్వారా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు క్లియర్ అయ్యేలా గత రెండు నెలలుగా మంచి సేవలు అందిస్తున్నందుకు రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బందిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ అభినందించారు. రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బి.ఆర్.కె.ఆర్ భవన్ లో కలిసారు.

రిజిస్ట్రేషన్ శాఖ లో అన్ని స్థాయిలలో అతి తక్కువ సమయంలో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసినందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ కు అసోసియేషన్ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రిజిస్ట్రేషన్ లకు గల డిమాండ్ మరియు ఈ ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్నందున మార్చి, 2021 మాసంలో అన్ని ఆదివారాలు, రెండవ శనివారం పనిచేస్తామని అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి తెలిపారు.

తదనుగుణంగా, ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాలను అన్ని అదివారాలు (మార్చి 7th, 14th, 21st , 28th ) మరియు రెండవ శనివారం (మార్చి 13th ) లలో కూడా పనిచేసేందుకు తెరిచివుంచాలని నిర్ణయించింది. కావున అన్ని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాలు మార్చి మాసంలో మహాశివరాత్రి (మార్చి 11th ) మరియు హోళి (మార్చి 29th ) రోజులలో తప్ప మిగత అన్ని రోజులలో తెరిచివుంటాయి. ఈ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోగలరని కోరారు.

ఈ సమావేశంలో స్టాంపులు, రిజిష్ట్రేషన్ల కమీషనర్ మరియు IG శేషాద్రి , అసోసియేషన్ ప్రెసిడెంట్ స్ధిత ప్రజ్ఞ, కన్వీనర్ మరియు టిఎన్జిఓ హైదరాబాద్ నగర అద్యక్షుడు ముజిబ్, అసోసియేట్ ప్రెసిడెంట్ సహదేవ్, అసోసియేషన్ సభ్యులు ప్రణయ్ కుమార్, సిరాజ్ అన్వర్, నరేష్ గౌడ్ పాల్గొన్నారు.

Read More:

షర్మిల కొత్త పార్టీపై చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్‌.. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఏమన్నారంటే..

అంగన్‌వాడీలకు త్వరలోనే తీపి వార్త.. కాషాయం పార్టీకి ప్రజలు త్వరలోనే కర్రు కాల్చి వాత పెడతారు -సత్యవతి రాథోడ్‌