AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహుల్ అమేథీ ఓటర్ల దీవెనలను తిరస్కరించారు..

అమేథీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరానీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ అమేథి ప్రజల్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. 15 ఏళ్ల పాటు మద్దతుగా నిలిచిన అమేథి ప్రజల్ని రాహుల్ విడిచి వెళ్లడానికి నిర్ణయించుకున్నారని ఆరోపించారు. పర్సదేపూర్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నేను ఇక్కడికి ప్రజల దీవెనలు తీసుకునేందుకు వచ్చాను. కానీ అతను (రాహుల్) అమేథీ ఓటర్ల దీవెనలు తిరస్కరించి.. […]

రాహుల్ అమేథీ ఓటర్ల దీవెనలను తిరస్కరించారు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 04, 2019 | 8:52 PM

Share

అమేథీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరానీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ అమేథి ప్రజల్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. 15 ఏళ్ల పాటు మద్దతుగా నిలిచిన అమేథి ప్రజల్ని రాహుల్ విడిచి వెళ్లడానికి నిర్ణయించుకున్నారని ఆరోపించారు. పర్సదేపూర్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నేను ఇక్కడికి ప్రజల దీవెనలు తీసుకునేందుకు వచ్చాను. కానీ అతను (రాహుల్) అమేథీ ఓటర్ల దీవెనలు తిరస్కరించి.. వయనాడ్‌లో నామినేషన్ వేశారని అన్నారు.