AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎమ్మెల్సీగా పెన్మత్స సురేష్ బాబు నామినేషన్‌

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెన్మత్స సురేష్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఆయన నామినేషన్‌ వేశారు.

ఎమ్మెల్సీగా పెన్మత్స సురేష్ బాబు నామినేషన్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 13, 2020 | 3:54 PM

Share

penumatsa suresh babu: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెన్మత్స సురేష్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఆయన నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పెన్మత్స సురేష్ బాబు మాట్లాడుతూ.. అందరినీ కలుపుకుని పార్టీకి మంచిపేరు తెచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. కాగా రాజ్యసభకు ఎన్నికైన  మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానానికి దివంగత నేత పెన్మత్స సాంబశివ రాజు తనయుడు సురేష్‌ బాబు పేరును సీఎం వైఎస్ జగన్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇక నామినేషన్‌ దాఖలకు ఈ నెల 13 ఆఖరి తేదీ కాగా.. ఈ నెల 24న ఎన్నిక జరగనుంది.

Read More:

జాకీచాన్‌, టోనీ జా నన్ను ప్రశంసించారు

ఆ వివరాలన్నీ డిస్‌ప్లేలో పెట్టండి: ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం ఆదేశం