టీడీపీలో మిగిలేది.. ఆ ముగ్గురే: విష్ణువర్థన్ రెడ్డి

టీడీపీలో ఆ ముగ్గురు తప్ప ఎవరూ మిగలరని బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి జోస్యం చెప్పారు. మాజీ సీఎం చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ తప్ప ఆ పార్టీలో మరెవరూ ఉండరని ఆయన అన్నారు. టీవీ9తో మాట్లాడిన విష్ణువర్థన్ రెడ్డి.. చేరికల విషయంలోనే బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందన్నారు. వారు ముగ్గురు కాంగ్రెస్‌లోనూ.. మిగతా నాయకులంతా బీజేపీలోనూ చేరతారని తెలిపారు. కాగా.. ఆర్టికల్ 370 రద్దుపై కేశినేని నాని మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కేశినేని నాని […]

టీడీపీలో మిగిలేది.. ఆ ముగ్గురే: విష్ణువర్థన్ రెడ్డి
Follow us

| Edited By:

Updated on: Aug 07, 2019 | 2:11 PM

టీడీపీలో ఆ ముగ్గురు తప్ప ఎవరూ మిగలరని బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి జోస్యం చెప్పారు. మాజీ సీఎం చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ తప్ప ఆ పార్టీలో మరెవరూ ఉండరని ఆయన అన్నారు. టీవీ9తో మాట్లాడిన విష్ణువర్థన్ రెడ్డి.. చేరికల విషయంలోనే బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందన్నారు. వారు ముగ్గురు కాంగ్రెస్‌లోనూ.. మిగతా నాయకులంతా బీజేపీలోనూ చేరతారని తెలిపారు.

కాగా.. ఆర్టికల్ 370 రద్దుపై కేశినేని నాని మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కేశినేని నాని అనారోగ్యంతో ఉంటే.. పిచ్చి ఆస్పత్రిలో చేర్చించాలని హితబోధ చేశారు. సీపీఐ, సీపీఎం పార్టీల్లో పాకిస్తాన్ కాపలా కుక్కలు ఉన్నాయని తీవ్రంగా ఆరోపించారు. ఆ పార్టీల నేతలు దేశం వదిలి వెళ్లిపోవాలన్నారు. బీజేపీకి అధికారం ముఖ్యం కాదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే.. బీజేపీ పనిచేస్తోందని.. త్వరలోనే అసెంబ్లీ సీట్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు విష్ణువర్థన్ రెడ్డి.