ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి నన్నపనేని రాజీనామా

ఏపీ మహిళా కమీషన్ చైర్ పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి రాజీనామా చేశారు. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌కి తమ రాజీనామా పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం మారింది కాబట్టి నైతిక బాధ్యతగా రాజీనామా చేశానన్నారు. మూడేళ్ళ యాన్యువల్ రిపోర్ట్ గవర్నర్‌కి అందజేశానని.. నా రిపోర్ట్ చూసి ఆయన అభినందించారన్నారు. నా హయాంలో బాధిత మహిళలకు అన్ని రకాలుగా అండగా నిలిచానని తెలిపారు. మహిళా హాస్టల్స్‌లో భద్రత పెంచాల్సిన అవసరం ఉందని.. కుటుంబ వ్యవస్థని […]

ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి నన్నపనేని రాజీనామా
Follow us

| Edited By:

Updated on: Aug 07, 2019 | 1:45 PM

ఏపీ మహిళా కమీషన్ చైర్ పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి రాజీనామా చేశారు. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌కి తమ రాజీనామా పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం మారింది కాబట్టి నైతిక బాధ్యతగా రాజీనామా చేశానన్నారు. మూడేళ్ళ యాన్యువల్ రిపోర్ట్ గవర్నర్‌కి అందజేశానని.. నా రిపోర్ట్ చూసి ఆయన అభినందించారన్నారు. నా హయాంలో బాధిత మహిళలకు అన్ని రకాలుగా అండగా నిలిచానని తెలిపారు. మహిళా హాస్టల్స్‌లో భద్రత పెంచాల్సిన అవసరం ఉందని.. కుటుంబ వ్యవస్థని పటిష్ట పరచాలని చెప్పారు నన్నపనేని రాజకుమారి.