AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మీవి చౌకబారు రాజకీయాలు’.. సోనియాపై బీజేపీ ఫైర్

దేశంలో ఈ కరోనా వేళ బీజేపీ.. మత విద్వేషపూరిత వైరస్ ని వ్యాపింపజేస్తోందని అంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన ఆరోపణను కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ ఖండించారు.

'మీవి చౌకబారు రాజకీయాలు'.. సోనియాపై బీజేపీ ఫైర్
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 23, 2020 | 5:35 PM

Share

దేశంలో ఈ కరోనా వేళ బీజేపీ.. మత విద్వేషపూరిత వైరస్ ని వ్యాపింపజేస్తోందని అంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన ఆరోపణను కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ ఖండించారు. చౌక బారు  రాజకీయాలు (చీప్ పాలిటిక్స్) చేయరాదని ఆయన సోనియాకు సూచించారు. మేమేమీ మతపరమైన చీలికలు తేవడానికి యత్నించడంలేదని, సంఘటితంగా కరోనాపై పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. దయచేసి చీప్ పాలిటిక్స్ కి దిగకండి అని కోరారు. కాగా-గురువారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడిన సోనియా.. ఇండియాలోని ప్రతి వ్యక్తీ కోవిడ్-19 పై పోరాడుతుంటే బీజేపీ.. సామాజిక సామరస్యానికి తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె తమ పార్టీ నేతలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో లాక్ డౌన్ అమలులోకి వఛ్చినప్పటినుంచి తాను ఎన్నోసార్లు ప్రధాని మోదీకి లేఖలు రాశానని, పలు సూచనలు చేశానని, నిర్మాణాత్మక సహకారం ఉంటుందని పేర్కొన్నానని ఆమె చెప్పారు. అయితే దురదృష్టవశాత్తూ ప్రభుత్వం తమ సూచనలకు  పాక్షికంగా మాత్రమే స్పందించిందని అన్నారు. బీజేపీ మత చీలికలు తెచ్చేందుకు యత్నిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఓ తీర్మానాన్ని ఆమోదించింది.