నిజామాబాద్ ఎంపీ స్థానానికి నామినేషన్ వేసిన కల్వకుంట్ల కవిత
నిజామాబాద్ ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ తరపున కల్వకుంట్ల కవిత ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఎంపీ కవిత ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇవాళ ఉదయం నిజామాబాద్ శివారులోని సారంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఎంపీ కవిత, ఆమె భర్త అనిల్ ప్రత్యేక పూజలు చేశారు. మరోసారి పార్లమెంట్కు వెళ్లడానికి అవకాశం ఇస్తే…నా శాయశక్తులా మీ సేవ చేసేందుకు ముందుంటానని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. దేశంలో రాజకీయ […]
నిజామాబాద్ ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ తరపున కల్వకుంట్ల కవిత ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఎంపీ కవిత ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇవాళ ఉదయం నిజామాబాద్ శివారులోని సారంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఎంపీ కవిత, ఆమె భర్త అనిల్ ప్రత్యేక పూజలు చేశారు.
మరోసారి పార్లమెంట్కు వెళ్లడానికి అవకాశం ఇస్తే…నా శాయశక్తులా మీ సేవ చేసేందుకు ముందుంటానని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈ సమయంలో రాష్ట్రంలో 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే.. తెలంగాణ రాష్ట్ర హక్కులను సాధించుకునే అవకాశం ఉందని ఆమె తెలిపారు.
Grateful to our honorable leader Sri KCR Garu and @trspartyonline for bestowing me with this great opportunity and responsibility as Member of Parliament from Nizamabad Constituency. I assure that I will perform my duties diligently and fulfill the hopes of people of Nizamabad. pic.twitter.com/W3jUKd6S4c
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 22, 2019