AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయసాయి రెడ్డికి లక్ష్మీనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 88 స్థానాలు విజయం సాధిస్తుందని, మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నేత వీవీ లక్ష్మీనారాయణ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కౌంటర్ ఇవ్వగా.. లక్ష్మీనారాయణ గట్టిగా బదులిచ్చారు. ‘సొంతంగా పోటీ చేసిందే 65 సీట్లలో.. పవన్ కళ్యాణ్ అనుంగు అనుచరుడు జేడీ లక్ష్మీనారాయణేమో 88 స్థానాల్లో గెలిచి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని జోస్యం చెబుతున్నాడు. […]

విజయసాయి రెడ్డికి లక్ష్మీనారాయణ స్ట్రాంగ్ కౌంటర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 20, 2019 | 6:51 AM

Share

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 88 స్థానాలు విజయం సాధిస్తుందని, మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నేత వీవీ లక్ష్మీనారాయణ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కౌంటర్ ఇవ్వగా.. లక్ష్మీనారాయణ గట్టిగా బదులిచ్చారు. ‘సొంతంగా పోటీ చేసిందే 65 సీట్లలో.. పవన్ కళ్యాణ్ అనుంగు అనుచరుడు జేడీ లక్ష్మీనారాయణేమో 88 స్థానాల్లో గెలిచి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని జోస్యం చెబుతున్నాడు. ఇతను దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలాగే లేనివి ఉన్నట్టు రాశాడు. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా?’ అని విజయసాయి ట్వీట్ చేశారు.

సీబీఐ జేడీగా పని చేసిన లక్ష్మీనారాయణ.. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులను విచారించిన సంగతి తెలిసిందే. విజయసాయి రెడ్డి తన ట్వీట్‌లో పరోక్షంగా ఈ కేసుల అంశాన్ని ప్రస్తావించారు. దీనికి లక్ష్మీనారాయణ స్పందిస్తూ.. గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారంటూనే.. గట్టిగా సమాధానం ఇచ్చారు.

‘జనసేన సొంతంగా 140 స్థానాల్లో పోటీ చేసింది. మిత్రపక్షాలైన బీఎస్పీ 21, సీపీఐ, సీపీఎం 14 స్థానాల్లో పోటీ చేశాయి. మొత్తం 175 స్థానాల్లో జనసేన కూటమి పోటీ చేసింది. మా లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి. మీరు సీఏ చదివారు అయినా కూడా మీ లెక్కలు తప్పులు ఎలా అవుతున్నాయో మాకు అర్థం కావట్లేదు. మీ లెక్కలు సరిచూసుకోండి ఎందుకంటే మేం సత్యం, న్యాయం మీద ఆధారపడి పని చేసేవాళ్లం కాబట్టి. మీ తప్పుడు లెక్కల వల్ల ఎంతోమంది ఇరుక్కున్నారు. ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చే విధానాన్ని మొదలుపెట్టండ’ని లక్ష్మీనారాయణ ట్వీట్లు చేశారు.

‘కనీసం జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేసిందో లెక్క కూడా తెలియని మీరు చార్టర్డ్ అకౌంటెంట్ కావడం మా దురదృష్టం. ఇలా తప్పుడు లెక్కలు చెబుతారు కాబట్టే అక్రమ ఆర్థిక లావాదేవీల కేసులో ఏ2గా విజయసాయి రెడ్డి జైల్లో చిప్పకూడు తిన్నారు’ అని జనసేన శతఘ్ని టీం వైసీపీ నేత వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చింది.