AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonia Gandhi: యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఎలెక్షన్ కమిటీ..ప్రతిపాదనకు సోనియా గాంధీ ఆమోదం..

యూపీలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఎలెక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లాలూ, మాజీ కేంద్ర మంత్రులు సల్మాన్ ఖుర్షీద్, రాజీవ్ శుక్లా, ఆర్.పీ.ఎన్. సింగ్ తదితరులతో కూడిన ఈ కమిటీకి పార్టీ...

Sonia Gandhi: యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఎలెక్షన్ కమిటీ..ప్రతిపాదనకు సోనియా గాంధీ ఆమోదం..
Sonia Gandhi
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 12, 2021 | 10:09 AM

Share

యూపీలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఎలెక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లాలూ, మాజీ కేంద్ర మంత్రులు సల్మాన్ ఖుర్షీద్, రాజీవ్ శుక్లా, ఆర్.పీ.ఎన్. సింగ్ తదితరులతో కూడిన ఈ కమిటీకి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆమోదముద్ర వేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలియజేస్తూ.. ఈ కమిటీలో మరో 38 మంది సభ్యులు కూడా ఉంటారన్నారు. జాతీయ అధ్యక్షులు గానీ..ఏఐసీసీ చైర్ పర్సన్స్ గానీ. యూపీ ఫ్రంటల్ సంస్థల హెడ్స్ లేదా..ఆ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు ఇందులో ఎక్స్-అఫిషియో సభ్యులుగా ఉంటారన్నారు. యూపీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత ఆరాధన మిశ్రా, మొహిసినా కిద్వాయ్, ఖుర్షీద్, నిర్మల్ ఖాత్రి, ప్రమోద్ తివారీ, పి.ఎల్.పునియా, వివేక్ బన్సాల్, మాజీ ఎంపీలు రాజేష్ మిశ్రా, రాజారామ్ పాల్ ప్రభృతులతో ఈ పానెల్ ఏర్పాటైందన్నారు. ఏఐసీసీ కార్యదర్శులు ఇమ్రాన్ మసూద్, బ్రీజ్ లాల్ ఖాబ్రీ, జితేంద్ర బాఘేల్ తదితరులు కూడా ఈ ఎలెక్షన్ కమిటీలో ఎక్స్-అఫిషియో సభ్యులుగా ఉన్నారు.

పార్టీ నేత ప్రియాంక గాంధీ నేతృత్వంలో తాము ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని, బీజేపీని ఓడించి మూడు దశాబ్దాల తరువాత మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంటామని అజయ్ కుమార్ లాలూ తెలిపారు. బీజేపీ గద్దె దిగు అనే నినాదంతో ఈ నెల 9 న రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. 403 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ఈ ప్రొటెస్ట్ నిర్వహించారు. ప్రియాంక గాంధీ గత నెలలో లక్నోను సందర్శించి రాష్ట్రంలో బీజేపీని ఓడించడానికి కేడర్ అంతా సమైక్యంగా కృషి చేయాలనీ కోరారు. ఇప్పటికే ఆమె ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్టు తెలుస్తోంది. యూపీ అసెంబ్లీ కాలపరిమితి వచ్చే ఏడాది మార్చి నెలలో ముగియనుంది.

మరిన్ని ఇక్కడ చూడండి : షూటింగ్స్ లో డేంజర్ బెల్స్.. స్టన్నింగ్‌ స్టంట్‌ చేసేప్పుడు సీన్ రివర్స్ అయితే…?:Danger Bells In Shooting Live video.

 పవన్‌ బర్త్‌డే గిఫ్ట్.. దిమ్మదిరిగే రేంజ్‌లో సర్‌ప్రైజ్‌ సిద్ధం చేస్తున్న రానా చిత్రయూనిట్..:Pawan kalyan Birthday Video.

 బుర్జ్ ఖలీఫా హోటల్ పై మహిళ…ఇదెక్కడి యాడ్ రా మావా..!వీడియో వైరల్..:woman on Burj Khalifa Video.

 రాంగ్‌ రూటులో వచ్చిన మహిళ..అంతలోనే ప్రమాదం.!రెప్పపాటులో రెండు కాళ్ళు పోయాయి..: Traffic Rules Video.

Follow Us
సూర్యుడిపై శని దృష్టి: వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగాలు..!
సూర్యుడిపై శని దృష్టి: వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగాలు..!
మరణిస్తూ ఐదుగురు ప్రాణాలను కాపాడాడు..
మరణిస్తూ ఐదుగురు ప్రాణాలను కాపాడాడు..
లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందా..? రాత్రి పువ్వులు కోయడంపై ఆశ్చర్యకర
లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందా..? రాత్రి పువ్వులు కోయడంపై ఆశ్చర్యకర
పొట్ట ఖరాబైందా?.. విరేచనాలను తగ్గించే హోం రెమెడీస్ ఇవే!
పొట్ట ఖరాబైందా?.. విరేచనాలను తగ్గించే హోం రెమెడీస్ ఇవే!
గురువు స్థానం మారాడు.. ఈ రాశుల వారికి ఇక చుక్కలే.. !
గురువు స్థానం మారాడు.. ఈ రాశుల వారికి ఇక చుక్కలే.. !
ఉప్పల్ అడ్డాలో కోహ్లీ పరుగుల వేట.. అరుదైన రికార్డులో రన్ మెషీన్
ఉప్పల్ అడ్డాలో కోహ్లీ పరుగుల వేట.. అరుదైన రికార్డులో రన్ మెషీన్
పెద్ది స్పెషల్ సాంగ్ రాయడానికే 50 రోజులు పట్టింది. కారణం ఇదే..
పెద్ది స్పెషల్ సాంగ్ రాయడానికే 50 రోజులు పట్టింది. కారణం ఇదే..
మండు ఎండలో కూడా మరువం ఆరోగ్యంగా ఉండాలా ఐతే ఈ ఒక్క పని చేయండి
మండు ఎండలో కూడా మరువం ఆరోగ్యంగా ఉండాలా ఐతే ఈ ఒక్క పని చేయండి
ఆ వందే భారత్‌లో కీలక మార్పులు.. 8 కోచ్‌లకు బదులుగా 20 కోచ్‌లు
ఆ వందే భారత్‌లో కీలక మార్పులు.. 8 కోచ్‌లకు బదులుగా 20 కోచ్‌లు
సావిత్రికి పాటలు పాడనని తెగేసి చెప్పేసిన జానకమ్మ.. కారణమిదే
సావిత్రికి పాటలు పాడనని తెగేసి చెప్పేసిన జానకమ్మ.. కారణమిదే