AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెడిసికొట్టిన అచ్చెన్నాయుడి వ్యూహం.. ఆ రెండు చోట్లా టీడీపీకి పరాభవం.. కీలక నేతల శ్రమ వృథా

పంచాయతీ ఎన్నికల పరాభవానికి మున్సిపల్‌ ఫలితాలతో సమాధానం ఇవ్వాలనే టీడీపీ పంతం నెరవేరలేదు. ముఖ్యంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ఎత్తుగడలను..

బెడిసికొట్టిన అచ్చెన్నాయుడి వ్యూహం.. ఆ రెండు చోట్లా టీడీపీకి పరాభవం.. కీలక నేతల శ్రమ వృథా
K Sammaiah
|

Updated on: Mar 16, 2021 | 12:13 PM

Share

పంచాయతీ ఎన్నికల పరాభవానికి మున్సిపల్‌ ఫలితాలతో సమాధానం ఇవ్వాలనే టీడీపీ పంతం నెరవేరలేదు. ముఖ్యంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ఎత్తుగడలను అధికార పార్టీ వైసీపీ చిత్తు చేసింది. పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలపై కీలక నేతల శ్రమంతా వృథా అయింది. ఆ మున్సిపాల్టీలను చేజిక్కించుకునేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఒక ఎంపీ, మరో ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు, జిల్లాలోని మిగతా మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ ప్రతినిధులు దృష్టి సారించారు. అయినా వారెవరూ ఫంక గాలికి అడ్డుకట్ట వేయలేకపోయారు.

పలాస, ఇచ్చాపురం మున్సిపాల్టీల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ కీలక నేతలు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ ప్రజలు వాటిన్నింటినీ తిప్పికొట్టారు. జిల్లాలో పలాస, ఇచ్ఛాపురం, పాలకొండలో ఎన్నికలను టీడీపీ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వీటిపైనే ఎక్కువ దృష్టిసారించారు. పోలింగ్‌ వరకు తమ శక్తియుక్తులన్నీ ప్రదర్శించారు. అచ్చెన్నతో పాటు ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్, మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర్‌ శివాజీ, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌతు శిరీష, మిగతా మాజీ ఎమ్మెల్యేలంతా టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నించి ఓడిపోయారు.

అయితే ఆ మున్సిపాల్టీలో ఓటమి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడికి ఘోర పరాభవమే. ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌కు కూడా చావు దెబ్బ వంటిదేననే టాక్‌ వినిపిస్తుంది. పంచాయతీ ఎన్నికల్లోనూ కళా వెంకటరావు వంటి వారు ఎంత ప్రయత్నించినా గెలవలేకపోయారు. ప్ర

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముందు టీడీపీ నేతల ప్రచారం బెడిసి కొట్టిందనే టాక్‌ నడుస్తుంది. పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు, పాలకొండలో విశ్వాసరాయి కళావతి, పాలవలస విక్రాంత్, ఇచ్ఛాపురంలో పిరియా సాయిరాజ్, నర్తు రామారావు తదితర నేతలే బాధ్యత తీసుకుని గెలిపించారు. మొత్తానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షడు అచ్చెన్నాయుడికి భంగపాటు తప్పలేదు.

Read More:

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో శ్రీనివాస్‌గౌడ్‌.. తన పుట్టిన రోజున మొక్కలు నాటిన ఆబ్కారీ మంత్రి

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత