కేసీఆర్ కుమార్తెపై పోటీకి 1000మంది రైతులు.. స్పందించిన కవిత

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితపై పోటీ చేసేందుకు ఏకంగా వెయ్యిమంది సిద్ధమవుతున్నారు. కవితపై పోటీకి దిగబోతున్నవారందరూ రైతులు కావడం విశేషం. కవితపై తమ నిరసనను తెలిపేందుకు ఈ సరికొత్త పంథాను ఎంచుకున్నారు. పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర కోసం డిమాండ్ చేస్తున్న వీరంతా కవితపై మూకుమ్మడిగా పోటీకి దిగాలని రైతు సంఘాలు తీర్మానించాయి. కనీసం 500 నుంచి వెయ్యి వరకు నామినేషన్లు దాఖలు చేయాలని రైతులు నిర్ణయించారు. తనపై 1000 మంది […]

కేసీఆర్ కుమార్తెపై పోటీకి 1000మంది రైతులు.. స్పందించిన కవిత
Follow us

| Edited By:

Updated on: Mar 18, 2019 | 1:40 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితపై పోటీ చేసేందుకు ఏకంగా వెయ్యిమంది సిద్ధమవుతున్నారు. కవితపై పోటీకి దిగబోతున్నవారందరూ రైతులు కావడం విశేషం. కవితపై తమ నిరసనను తెలిపేందుకు ఈ సరికొత్త పంథాను ఎంచుకున్నారు. పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర కోసం డిమాండ్ చేస్తున్న వీరంతా కవితపై మూకుమ్మడిగా పోటీకి దిగాలని రైతు సంఘాలు తీర్మానించాయి. కనీసం 500 నుంచి వెయ్యి వరకు నామినేషన్లు దాఖలు చేయాలని రైతులు నిర్ణయించారు. తనపై 1000 మంది పోటీ చేయనున్నారని వచ్చిన వార్తలపై ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరికైనా అర్హత ఉందని ఆమె వ్యాఖ్యానించారు. జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్యలు ఈనాటివి కావని, దశాబ్దాల పాటు పరిపాలించిన ఆంధ్రా పాలకుల వైఖరి వల్లే వచ్చినవని అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని.. తమ సమస్యల పరిష్కారం కోసం చూస్తున్న రైతు సంఘాలతో చర్చిస్తానని ఎంపీ కవిత అన్నారు.