Mysore Tourist Places: మైసూరు వెళుతున్నారా? అయితే ఈ అద్భుతమైన ప్రదేశాలను మాత్రం అసలు మిస్ అవ్వకండి..
Mysore Tourist Places: దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో మైసూర్ ఒకటి. ఈ నగరాన్ని సిటీ ఆఫ్ ఫ్యాలెసెస్ అని కూడా పిలుస్తారు. మన భారతీయ సాంస్కృతిక, వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యాలుగా చెప్పుకునే ఎన్నో అద్భుత కట్టడాలు, ప్రదేశాలు ఈ నగరంలో కొలువై ఉన్నాయి.
Updated on: Apr 27, 2022 | 10:17 PM

కరంజి సరస్సు: ఈ సరస్సును ఫౌంటెన్ లేక్ అని కూడా పిలుస్తారు. చుట్టూ ఆహ్లాదకర వాతావరణంతో ఎంతో ప్రశాంతంగా కనిపించే ఈ సరస్సు పర్యాటకులను బాగా ఆకట్టుకుంటోంది.

దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో మైసూర్ ఒకటి. ఈ నగరాన్ని సిటీ ఆఫ్ ఫ్యాలెసెస్ అని కూడా పిలుస్తారు. మన భారతీయ సాంస్కృతిక, వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యాలుగా చెప్పుకునే ఎన్నో అద్భుత కట్టడాలు, ప్రదేశాలు ఈ నగరంలో కొలువై ఉన్నాయి.

మైసూర్ ప్యాలెస్: దేశంలోని అతిపెద్ద ప్యాలెస్లలో ఒకటైన మైసూర్ ప్యాలెస్ ను 1912లో వడయార్ రాజవంశీయులు నిర్మించారని చెబుతారు. ఈ ప్యాలెస్ లోని లైట్ అండ్ సౌండ్ షో ఎంతో స్పెషల్. ఇది పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ఇక్కడ దసరా ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

మైసూర్కు వెళితే ఈ పర్యాటక ప్రదేశాలు, కట్టడాలను తప్పకుండా సందర్శించాల్సిందే..

మైసూర్ జంతుప్రదర్శనశాల: మైసూర్కు వెళ్లిన వారు తప్పకుండా ఈ జూను సందర్శిస్తారు. ఇక్కడ రకరకాల జంతువులు, పక్షులు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

సోమనాథపుర ఆలయం: ఈ ఆలయం పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం కృష్ణ భగవానుడికి అంకితం చేయబడిన ఈ ఆలయ నిర్మాణం చూపరులను ఇట్టే ఆకట్టుకుంటోంది. అందుకే వేలాదిమంది పర్యాటకులు, భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించుకుంటారు.




