వేసవిని ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి దేశ, విదేశాల నుంచి ఇక్కడకు పోటెత్తుతారు.. ఎందుకంటే
హిమాలయ పర్వతాలను అనుకుని ఉన్న ప్రకృతి కాన్వాస్ చిత్రించిన చిత్రం హిమాచల్ ప్రదేశ్. హిమపాతాలు, పర్వతాలతో అందమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. శీతాకాలంలో మంచు అందాలను.. వేసవి కాలంలో చల్లదనం కోసం ఎక్కువ మంది పర్యటించడానికి ఇష్టపడే ప్రాతం. సిమ్లా-మనాలి చాలా మందికి తెలుసు. రవాణా సదుపాయాలు ప్రతి ప్రాంతానికి అందుబాటులోకి వచ్చిన తర్వాత దేశంలో తమకు నచ్చిన మనసు మెచ్చిన ప్రాంతాలను పర్యటించడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తిని చూపిస్తున్నారు. ఢిల్లీ దాని పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజలకు మాత్రమే కాదు.. ఆ సేతుహిమచల ప్రజలకు ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అత్యంత ఇష్టమైన ప్రదేశం. ఇప్పుడు వేసవి సెలవులు ఉన్నాయి. దీంతో ప్రజలు ఇక్కడకు వెళ్ళడానికి, సరదాగా గడపడానికి ఆసక్తిని చూపిస్తారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6