AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato Price: టమాటాలు కొనేందుకు సరిహద్దులు దాటి నేపాల్‌కు పరుగులు తీస్తోన్న ప్రజలు.. కారణం ఇదే!

దేశ వ్యాప్తంగా టమాట ధరలు హడలెత్తిస్తున్నాయి. కేవలం నెల రోజుల్లోనే టమాటా ధరలు ఆకాశానికి ఎగబాకాయి. దీంతో కొందరు దేశ సరిహద్దులు దాటి మరీ పక్క దేశాలకు వెళ్లిమరీ టమాటాలు కొనుగోలు..

Srilakshmi C
|

Updated on: Jul 13, 2023 | 10:31 AM

Share
డెహ్రాడూన్‌, జులై 13: దేశ వ్యాప్తంగా టమాట ధరలు హడలెత్తిస్తున్నాయి. కేవలం నెల రోజుల్లోనే టమాటా ధరలు ఆకాశానికి ఎగబాకాయి. దీంతో కొందరు దేశ సరిహద్దులు దాటి మరీ పక్క దేశాలకు వెళ్లిమరీ టమాటాలు కొనుగోలు చేస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ జిల్లాలోని భారత్‌-నేపాల్ సరిహద్దు వెంబడి చాలా మంది ప్రజలు అక్కడికి వెళ్లి టమాటాలు కొనుగోలు చేస్తున్నారు.

డెహ్రాడూన్‌, జులై 13: దేశ వ్యాప్తంగా టమాట ధరలు హడలెత్తిస్తున్నాయి. కేవలం నెల రోజుల్లోనే టమాటా ధరలు ఆకాశానికి ఎగబాకాయి. దీంతో కొందరు దేశ సరిహద్దులు దాటి మరీ పక్క దేశాలకు వెళ్లిమరీ టమాటాలు కొనుగోలు చేస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ జిల్లాలోని భారత్‌-నేపాల్ సరిహద్దు వెంబడి చాలా మంది ప్రజలు అక్కడికి వెళ్లి టమాటాలు కొనుగోలు చేస్తున్నారు.

1 / 5
నేపాల్‌ సరిహద్దు సమీప ప్రాంతాల్లో టమాట ధరలు మన దేశంలోని టమాట ధరలకు దాదాపు సగం ధరకే లభిస్తున్నాయి. దీంతో ధార్చుల, బన్‌బాసా నివాసితులు టమాటా కొనుగోలుకు నేపాల్‌కు వెళుతున్నారు.

నేపాల్‌ సరిహద్దు సమీప ప్రాంతాల్లో టమాట ధరలు మన దేశంలోని టమాట ధరలకు దాదాపు సగం ధరకే లభిస్తున్నాయి. దీంతో ధార్చుల, బన్‌బాసా నివాసితులు టమాటా కొనుగోలుకు నేపాల్‌కు వెళుతున్నారు.

2 / 5
కాగా మన దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం కిలో టమాట రూ.120 నుంచి రూ.130 వరకు విక్రయిస్తున్నారు. నేపాల్‌లో రూ. 62 నుంచి రూ. 69 తక్కువ ధరకే  దొరుకుతున్నాయి. సాధారణంగా వర్షాకాలంలో భారత్‌లో కూరగాయల ధరలు పెరుగుతుంటాయి.

కాగా మన దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం కిలో టమాట రూ.120 నుంచి రూ.130 వరకు విక్రయిస్తున్నారు. నేపాల్‌లో రూ. 62 నుంచి రూ. 69 తక్కువ ధరకే దొరుకుతున్నాయి. సాధారణంగా వర్షాకాలంలో భారత్‌లో కూరగాయల ధరలు పెరుగుతుంటాయి.

3 / 5
 దీనిని గ్రహించిన నేపాల్‌ ప్రభుత్వం ధాన్యం పంటలకు బదులు కూరగాయల పంటలను ప్రోత్సహిస్తోంది. రైతు సమూహాలను ఏర్పాటు చేసి వారికి విత్తనాలు, ఎరువులు వంటి అనేక వ్యవసాయ సబ్సిడీలను అందించి మరీ కూరగాయల సాగును పోత్రహిస్తోంది. పైగా ఈ సీజన్‌లో భారత్ నుంచి డిమాండ్‌ లభించడంతో మంచి లాభాలు గడిస్తున్నారు. నేపాల్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్, చంపావత్ జిల్లాల్లో కూరగాయల వ్యాపారం జరుగుతుంది.

దీనిని గ్రహించిన నేపాల్‌ ప్రభుత్వం ధాన్యం పంటలకు బదులు కూరగాయల పంటలను ప్రోత్సహిస్తోంది. రైతు సమూహాలను ఏర్పాటు చేసి వారికి విత్తనాలు, ఎరువులు వంటి అనేక వ్యవసాయ సబ్సిడీలను అందించి మరీ కూరగాయల సాగును పోత్రహిస్తోంది. పైగా ఈ సీజన్‌లో భారత్ నుంచి డిమాండ్‌ లభించడంతో మంచి లాభాలు గడిస్తున్నారు. నేపాల్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్, చంపావత్ జిల్లాల్లో కూరగాయల వ్యాపారం జరుగుతుంది.

4 / 5
ఇరు దేశాల ప్రజలతోపాటు స్థానిక వ్యాపారులు సైతం నేపాల్ నుంచి టమోటాలను టోకుతా కిలోకు రూ.40 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. నేపాలీ రూపాయి కంటే భారత్ కరెన్సీ విలువ ఎక్కువ కాబట్టి చౌకగా టమాటాలను కొనేందుకు భారతీయులు నేపాల్‌కు పరుగులు తీస్తున్నారు.

ఇరు దేశాల ప్రజలతోపాటు స్థానిక వ్యాపారులు సైతం నేపాల్ నుంచి టమోటాలను టోకుతా కిలోకు రూ.40 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. నేపాలీ రూపాయి కంటే భారత్ కరెన్సీ విలువ ఎక్కువ కాబట్టి చౌకగా టమాటాలను కొనేందుకు భారతీయులు నేపాల్‌కు పరుగులు తీస్తున్నారు.

5 / 5
Follow Us