ప్రతిక్షణం భయం భయం.. దెయ్యాలు ఎక్కువగా ఉండే ఈ ప్రదేశాలు తెలుసా?
దెయ్యాలంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి. చాలా మంది దెయ్యాల గురించి చెబితే చాలు వణికిపోతుంటారు. అయినప్పటికీ చాలా మంది దెయ్యాల కథలే వినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే మీరు అనేక దెయ్యాల కథల గురించి వినవచ్చు. కానీ దెయ్యాల ప్రదేశాలు కూడా ఉన్నాయంట. కాగా వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Jul 16, 2025 | 1:30 PM

చాలా మంది తమ కుటుంబ సభ్యుల లేదా, స్నేహితులతో కలిసి జాలీ జాలీగా ఏ గుడికో లేదా పచ్చటి ప్రకృతి మధ్య ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటారు. కానీ దెయ్యాలు ఉండే ప్రదేశాలకు వెళ్లడం ఎప్పుడైనా చూశారా.. మరి ఇదేనండి ఇక్కడి గమ్మత్తైన విషయం. భారతదేశంలో దెయ్యాలు నివాసం ఉండే కొన్ని పర్యాటక ప్రదేశాలు ఉన్నాయంట. అంతే కాకుండా చాలా మంది పర్యాటకులను దృష్టిని ఇవి ఆకర్షిస్తున్నాయంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

దెయ్యాల కథలు విన్నప్పుడు ఎంతో ఆసక్తి కలుగుతుంది. మరీ ముఖ్యంగా పాత బంగ్లాలు, పెద్ద వంతెనలల వద్ద దెయ్యాలు ఎక్కువగా తిరుగుతుంటాయని చెబుతుంటారు. అయితే చండీగఢ్లోని ఓ వంతెనె దెయ్యాల ప్రదేశం అంట. చండీగఢ్లోని సెక్టార్ 16లో నిర్మించిన హాంటెడ్ బ్రిడ్జ్ వద్ద దెయ్యాలు ఎక్కువగా తిరుగుతాయని చెబుతుంటారు. మరీ ముఖ్యంగా ఆ వంతెనపై నుంచి ఓ నర్సు పడి చనిపోయిందని ఇప్పటికీ చాలా మంది ఆ ప్రదేశంలో రాత్రి సమయంలో చనిపోయిన నర్స్ తెల్లటి యూనిఫామ్లో తిరుగుతూ కనిపిస్తుందని అక్కడి వారు చెబుతుంటారు.కాగా అలా ఇది దెయ్యాల వంతెనగా చాలా ప్రసిద్ధి చెందినది.

రాజస్థాన్లోని కుల్ధారా అనే గ్రామం దెయ్యాల గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఇది నేటి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అయితే జైసల్మేర్ సమీపంలోని ఈ గ్రామం ఒకప్పుడు పాలివాల్ బ్రాహ్మణుల సంపన్నగ్రామం, కానీ 1800లలో ఆ గ్రామం రాత్రికి రాత్రే నిర్జీవమై పోయిందంట. అయితే ఆ బ్రాహ్మణులు ఆ గ్రామంలో ఎవరు నివసించలేరని శాపం పెట్టారని, అందుకే ఇప్పటికీ అక్కడ ఎవరు నివసించరు, అంతే కాకుండా అక్కడ ఇప్పటికీ పలువురు రాత్రి సమయంలో తిరుగుతూ కనిపిస్తారని చెబుతుంటారు.

ఉత్తరప్రదేశ్లో ఉన్న జీపీ బ్లాక్ అనే ప్రదేశం దెయ్యాల ప్రదేశంగా చాలా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడ శిథిలమైన బంగ్లాలో దెయ్యాలను నివాసం ఉంటాయిని అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. చాలా మంది నలుగురు పురుషులు శిథిలమైన బంగ్లాలో మద్యం తాగుతున్నట్లు తాము చూశామని, ఎరుపు రంగు దుస్తులు ధరించిన స్త్రీ ఆత్మ కూడా కనిపించిందని ప్రజలు చెబుతుంటారు.

గురు గ్రామ్లోని అశోక విహార్ ఫ్లైఓవర్ కూడా దెయ్యాలకు కథలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఈ ప్రదేశంలో తెల్ల చీరలో ఓ మహిళ సహాయం అడుగుతూ చాలా మంది డ్రైవర్లకు కనిపించిందంట. కానీ వాహనం ఆగిన వెంటనే ఆమె మాయమై పోయేదంట. అంతే కాకుండా ఆమె మాయం అయిన తర్వాత ఏవేవో శబ్ధాలు వినిపించేవాంట. అయితే ఆ మహిళ రోడ్డు ప్రమాదంలో మరణించిందని స్థానికులు నమ్ముతారు.



