- Telugu News Photo Gallery Technology photos Facebook introduced end to end end to end encryption feature for all users
Facebook: యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఫేస్బుక్.. కొందరికే అందుబాటులో ఉన్న ఆ ఫీచర్ ఇకపై అందరికీ..
Facebook: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం తన యూజర్లను కాపాడుకోవడంతో పాటు కొత్త యూజర్లను పెంచుకునే పనిలో పడింది. ఇందులో బాగంగానే మొన్నటి వరకు కేవలం కొందరికి మాత్రమే అందుబాటులో ఉన్నఓ ఫీచర్ను అందరికీ అందుబాటులోకి తెచ్చింది..
Updated on: Jan 30, 2022 | 8:25 AM

సోషల్ మీడియాలో పెను సంచలనంలా దూసుకొచ్చింది ఫేస్ బుక్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఆదరణ పొందిన సోషల్ మీడియా సైట్గా పేరు తెచ్చుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 3 బిలియన్ యూజర్లను సొంతం చేసుకున్న ఈ సోషల్ మీడియా దిగ్గజం ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటూనే ఉంటుంది.

ఇలా అందుబాటులోకి తీసుకొచ్చిందే ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఫీచర్. అయితే 2016లో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఫీచర్ను కేవలం కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉండేది.

యితే మెసేంజర్లో యూజర్లు చేసే చాట్స్, కాల్స్కు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ (E2EE) సెక్యూరిటీ ఫీచర్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో పడింది ఫేస్బుక్. దీంతో మెసేజ్ పంపించే వారికి, రిసీవ్ చేసుకునే వారికి తప్ప మరెవరికీ ఆ సంభాషణ తెలియకుండా ఉంటుంది.

యూజర్ల ప్రైవేసీ పెద్ద పీట వేసే ఈ ఫీచర్ను వాట్సాప్లో గతలోనే తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వాట్సాప్ ఇప్పటికే ఈ ఫీచర్ను డీఫాల్ట్గా సపోర్ట్ చేస్తుంది.

ఇదిలా ఉంటే ఫేస్బుక్లో ఈ ఫీచర్తో పాటు యూజర్లు మసేజ్లకు రిప్లై ఇవ్వానికి లాంగ్ ప్రెస్ అవకాశం తీసుకొచ్చింది. దీంతో పాటుఎవరైనా పంపిన మెసేజ్ను స్క్రీన్ షాట్ తీస్తే పంపిన వారికి తెలిసిపోయే ఫీచర్ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది.





























