AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. ఒక్కసారి తినే వాళ్ళు రెండు సార్లు తింటారు

కోడిగుడ్డు ఎండుచేపల పులుసు మనకి కొంచం కొత్తగానే ఉంటుంది. కానీ, కొందరు మాత్రం దీనిని చాలా ఇష్టంగా తింటారు. మరి, ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 24, 2026 | 10:56 PM

Share
కావాల్సిన పదార్థాలు : 300 గ్రాములు ఎండు చేపలు, 3 ఉడకపెట్టిన గుడ్లు,  ఒక పెద్ద ఉల్లిపాయలు, 6 టేబుల్ స్పూన్స్ నూనె, పోపు, 5 పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత ఉప్పును తీసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు : 300 గ్రాములు ఎండు చేపలు, 3 ఉడకపెట్టిన గుడ్లు, ఒక పెద్ద ఉల్లిపాయలు, 6 టేబుల్ స్పూన్స్ నూనె, పోపు, 5 పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత ఉప్పును తీసుకోవాలి.

1 / 5
ముందుగా  ఎండు చేపలను తీసుకుని వాటిని ముక్కలుగా చేసుకుని ఉప్పు, వేడి నీళ్ళతో కడిగి శుభ్రపరచుకోవాలి. 10 5  నిమిషాల పాటు ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి.

ముందుగా  ఎండు చేపలను తీసుకుని వాటిని ముక్కలుగా చేసుకుని ఉప్పు, వేడి నీళ్ళతో కడిగి శుభ్రపరచుకోవాలి. 10 5 నిమిషాల పాటు ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి.

2 / 5
స్టవ్ వెలిగించి దానిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక పోపు గింజలు, టమోటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని రంగు మారే వరకు వేయించాలి.

స్టవ్ వెలిగించి దానిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక పోపు గింజలు, టమోటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని రంగు మారే వరకు వేయించాలి.

3 / 5

ఇప్పుడు ఒక టీ స్పూన్  అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, కారం, ఉప్పు, ఒక కప్పు చింతపండు రసం, ఒక గ్లాస్ నీళ్లు పోసి 10 నిముషాల పాటు స్టవ్ మీదే ఉంచండి.

ఇప్పుడు ఒక టీ స్పూన్  అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, కారం, ఉప్పు, ఒక కప్పు చింతపండు రసం, ఒక గ్లాస్ నీళ్లు పోసి 10 నిముషాల పాటు స్టవ్ మీదే ఉంచండి.

4 / 5
ఇప్పుడు ఈ మిశ్రమంలో ఉడకపెట్టిన కోడిగుడ్లు వేసి  నూనె పైకి తేలే వరకు మీడియం మంటపై 15 నిముషాలు ఉంచి బాగా ఉడికించాలి. దించే ముందు కొత్తిమీర వేసి టేస్ట్ చూసి తక్కువైతే మళ్ళీ వాటిని కలుపుకొని దించేయండి. అంతే, వేడి వేడి కోడిగుడ్డు ఎండు చేపల పులుసు రెడీ .

ఇప్పుడు ఈ మిశ్రమంలో ఉడకపెట్టిన కోడిగుడ్లు వేసి నూనె పైకి తేలే వరకు మీడియం మంటపై 15 నిముషాలు ఉంచి బాగా ఉడికించాలి. దించే ముందు కొత్తిమీర వేసి టేస్ట్ చూసి తక్కువైతే మళ్ళీ వాటిని కలుపుకొని దించేయండి. అంతే, వేడి వేడి కోడిగుడ్డు ఎండు చేపల పులుసు రెడీ .

5 / 5
Follow Us