AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గౌతమ్ గంభీర్ కోచ్ పదవి ఊస్టింగ్..? బీసీసీఐ సంచలన నిర్ణయం వెనుక అసలు కథ ఇదే..!

Head Coach Gautam Gambhir: వరుస వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని టీమిండియాను మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టడం గంభీర్ ముందున్న అతిపెద్ద సవాలు. బోర్డు అందించిన ఈ మద్దతుతో ఆయన రాబోయే లంక పర్యటనలో ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారో వేచి చూడాలి. ఈ నిర్ణయం భారత క్రికెట్ భవిష్యత్తును ఏ దిశగా తీసుకెళ్తుందో కాలమే నిర్ణయిస్తుంది.

Venkata Chari
|

Updated on: Aug 13, 2026 | 10:13 AM

Share
Head Coach Gautam Gambhir: వరుస పరాజయాలతో భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలపాలవుతున్నారు. విదేశీ పర్యటనల్లో ఘోర వైఫల్యాలు, టెస్టుల్లో పేలవమైన ప్రదర్శనతో ఆయనను తొలగిస్తారనే ప్రచారం ఊపందుకుంది. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రస్తుతానికి ఆయనకు ఊరటనిచ్చేలా ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అందుతోంది.

Head Coach Gautam Gambhir: వరుస పరాజయాలతో భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలపాలవుతున్నారు. విదేశీ పర్యటనల్లో ఘోర వైఫల్యాలు, టెస్టుల్లో పేలవమైన ప్రదర్శనతో ఆయనను తొలగిస్తారనే ప్రచారం ఊపందుకుంది. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రస్తుతానికి ఆయనకు ఊరటనిచ్చేలా ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అందుతోంది.

1 / 5
టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ ప్రయాణం అసలు ముళ్లబాటలా సాగుతోంది. ఇటీవలి ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో పరిమిత ఓవర్ల సిరీస్‌లలో జట్టు ఘోరంగా విఫలం కావడం ఆయన రికార్డుపై పెద్ద మచ్చగా మిగిలిపోయింది. దీనికి తోడు స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర టెస్టు పరాజయాలు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. సోషల్ మీడియాలో గంభీర్‌ను వెంటనే కోచ్ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవడమే ఇప్పుడు భారత జట్టుకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి గంభీర్ కోచ్ కుర్చీకి ఎలాంటి ముప్పు లేదని కథనాలు వెలువడుతున్నాయి.

టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ ప్రయాణం అసలు ముళ్లబాటలా సాగుతోంది. ఇటీవలి ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో పరిమిత ఓవర్ల సిరీస్‌లలో జట్టు ఘోరంగా విఫలం కావడం ఆయన రికార్డుపై పెద్ద మచ్చగా మిగిలిపోయింది. దీనికి తోడు స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర టెస్టు పరాజయాలు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. సోషల్ మీడియాలో గంభీర్‌ను వెంటనే కోచ్ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవడమే ఇప్పుడు భారత జట్టుకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి గంభీర్ కోచ్ కుర్చీకి ఎలాంటి ముప్పు లేదని కథనాలు వెలువడుతున్నాయి.

2 / 5
గంభీర్‌పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, భారత రెడ్ బాల్ క్రికెట్ ప్రస్తుతం ఒక పెద్ద మార్పుల దశ గుండా వెళ్తోందనే నిజాన్ని బీసీసీఐ గుర్తించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ లాంటి దిగ్గజాలు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత జట్టు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ సారథ్యంలో ఒక కొత్త తరం జట్టు రూపుదిద్దుకుంటోంది. ఈ మార్పుల సమయంలో ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండవని, కొత్త ఆటగాళ్లకు కొంత సమయం ఇవ్వాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. అందుకే ఈ పరాజయాలకు కేవలం కోచ్‌ను మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదనే అభిప్రాయం బోర్డులో వ్యక్తమవుతోంది.

గంభీర్‌పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, భారత రెడ్ బాల్ క్రికెట్ ప్రస్తుతం ఒక పెద్ద మార్పుల దశ గుండా వెళ్తోందనే నిజాన్ని బీసీసీఐ గుర్తించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ లాంటి దిగ్గజాలు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత జట్టు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ సారథ్యంలో ఒక కొత్త తరం జట్టు రూపుదిద్దుకుంటోంది. ఈ మార్పుల సమయంలో ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండవని, కొత్త ఆటగాళ్లకు కొంత సమయం ఇవ్వాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. అందుకే ఈ పరాజయాలకు కేవలం కోచ్‌ను మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదనే అభిప్రాయం బోర్డులో వ్యక్తమవుతోంది.

3 / 5
రెండో ముఖ్యమైన అంశం ఆటగాళ్లను వేధిస్తున్న గాయాలు. సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ మధ్యలో గిల్ గాయపడకపోయి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని బోర్డు వర్గాలు నమ్ముతున్నాయి. రాబోయే శ్రీలంక టెస్టు పర్యటనకు కూడా గాయాల సమస్య వేధిస్తూనే ఉంది. పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా, నంబర్ 3 బ్యాటర్ సాయి సుదర్శన్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ లాంటి కీలక ఆటగాళ్లు ఈ పర్యటనకు దూరం కావడం పెద్ద దెబ్బ. ఇలాంటి పరిస్థితుల్లో కోచ్‌పై ఒత్తిడి పెంచడం సరైనది కాదని భావిస్తున్నారు. ఇక బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధిపతిగా ఉన్న లక్ష్మణ్ తన పదవితో ఎంతో సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి తాత్కాలిక కోచ్‌ను నియమించే ప్రసక్తి లేదని తేలిపోయింది.

రెండో ముఖ్యమైన అంశం ఆటగాళ్లను వేధిస్తున్న గాయాలు. సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ మధ్యలో గిల్ గాయపడకపోయి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని బోర్డు వర్గాలు నమ్ముతున్నాయి. రాబోయే శ్రీలంక టెస్టు పర్యటనకు కూడా గాయాల సమస్య వేధిస్తూనే ఉంది. పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా, నంబర్ 3 బ్యాటర్ సాయి సుదర్శన్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ లాంటి కీలక ఆటగాళ్లు ఈ పర్యటనకు దూరం కావడం పెద్ద దెబ్బ. ఇలాంటి పరిస్థితుల్లో కోచ్‌పై ఒత్తిడి పెంచడం సరైనది కాదని భావిస్తున్నారు. ఇక బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధిపతిగా ఉన్న లక్ష్మణ్ తన పదవితో ఎంతో సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి తాత్కాలిక కోచ్‌ను నియమించే ప్రసక్తి లేదని తేలిపోయింది.

4 / 5
శ్రీలంక పర్యటన తర్వాత ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత్‌కు కేవలం రెండు సిరీస్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ తక్కువ సమయంలో సరికొత్త ప్రయోగాలు చేయడం బోర్డుకు ఇష్టం లేదు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్ విషయానికి వస్తే, 2027 వన్డే ప్రపంచకప్ వరకు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా కొనసాగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. బోర్డు ఇచ్చిన ఈ ఆఖరి అవకాశాన్ని ఉపయోగించుకుని గంభీర్ జట్టును మళ్లీ విజయాల బాటలో నడిపిస్తారో లేదో వేచి చూడాలి.

శ్రీలంక పర్యటన తర్వాత ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత్‌కు కేవలం రెండు సిరీస్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ తక్కువ సమయంలో సరికొత్త ప్రయోగాలు చేయడం బోర్డుకు ఇష్టం లేదు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్ విషయానికి వస్తే, 2027 వన్డే ప్రపంచకప్ వరకు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా కొనసాగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. బోర్డు ఇచ్చిన ఈ ఆఖరి అవకాశాన్ని ఉపయోగించుకుని గంభీర్ జట్టును మళ్లీ విజయాల బాటలో నడిపిస్తారో లేదో వేచి చూడాలి.

5 / 5
Follow Us