- Telugu News Photo Gallery Spiritual photos Vinayak Chavithi 2024: Paper Ganesha idols are more in demand than POP Ganesha idols, know the details
Vinayaka Chavithi: మార్పు మొదలైంది.. POP గణేశ విగ్రహాల కంటే పేపర్ గణపతి విగ్రహాలకు భారీ డిమాండ్..
వినాయక చవితి వేడుకలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రెండు రోజుల్లో వినాయక చవితి పర్వదినాన్ని హిందువులు అత్యంత వైభవంగా జరుపుకోనున్నారు. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంట్లో వినాయకుడిని ప్రష్టించుకోవడమే కాదు.. మండపాలలో కూడా వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి భారీగా ఉత్సవాలు చేస్తారు. పిల్లలు పెద్దలు అత్యంత ఇష్టంగా జరుపుకునే వినాయక చవితి వేడుకల కోసం వినాయక విగ్రహాలకు భారీ డిమాండ్ నెలకొంటుంది. అయితే పర్యావరణ హితం కోసం పీఓపీ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయమని ఎప్పటి నుంచో ఓ నినాదం కొనసాగుతోంది.
Updated on: Sep 05, 2024 | 2:51 PM

పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి పీఓపీ గణేశ విగ్రహాల విక్రయాలపై నిషేధం విధించడంతో మట్టి వినాయక విగ్రహాలకు డిమాండ్ పెరిగింది. అయితే మట్టితో పాటు త్వరగా నీటిలో కరిగే విధంగా సహజ పదార్ధాలతో అంటే ఆవు పేడ, కాగితాలతో కూడా వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఈ ఏడాది కాగితాల వినాయకుడి విగ్రహాలకు మార్కెట్ లోకి తీసుకురావడంతో ఫుల్ డిమాండ్ మొదలైంది.

గణేష్ ఉత్సవాలకు కౌంట్ డౌన్ మొదలైంది. డిల్లీ నుంచి గల్లీ వరకూ వీధి వీధుల్లో కూడా సందడి నెలకొంది. సర్వత్రా గణేశ విగ్రహాన్ని కొనుగోలు చేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. నగరంలోని దుకాణాలు పిల్లలు, యువతతో నిండి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ సహా పలు ప్రాంతాలలో పేపర్ గణపయ్య సందడి చేస్తున్నారు. కర్నాటకలోని అట్టా ప్రభుత్వం పీఓపీ గణేశుడిని నిషేధించడంతో గణేశ తయారీదారులు పర్యావరణ అనుకూలమైన పేపర్ గణేశ విగ్రహాన్ని తయారు చేశారు.

నీటిని కలుషితం చేస్తున్నందున POP గణేశ విగ్రహాల అమ్మకాలను BBMP నిషేధించింది. దీంతో పర్యావరణహిత మట్టి విగ్రహాలకు డిమాండ్ పెరిగి మట్టి కొరతతో మట్టి విగ్రహాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఈ ఏడాది కాగితపు విగ్రహాలకు గిరాకీ పెరిగింది. ఈ విగ్రహాలు బెంగళూరు నగరంలో పలుచోట్ల ట్రినిటీ సర్కిల్, యశవంత్పూర్, బసవనగుడి, కంటోన్మెంట్ తదితర చోట్ల అందుబాటులో ఉన్నాయి.

మట్టి విగ్రహాలైతే 5 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించడం కష్టం. అయితే ఈ కాగితంతో గణపతి విగ్రహాన్ని 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించవచ్చు. ఈ కాగితం వినాయక విగ్రహాలను తయారు చేయడం చాలా కష్టం. అయితే ఎంత భారీ విగ్రహం అయినా సరే చాలా తేలికగా ఉంటుంది. దీనిని నిర్వహించడం సులభం.. పూజ అనంతరం నిమజ్జనం చేయడం మరింత సులభం. పర్యావరణ అనుకూలమైనది కనుక తయారీదారులు, వినియోగదారులు ఇద్దరూ పేపర్ గణేష్ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

ఈ పేపర్ గణపతిని తరలించడం కూడా చాలా ఈజీ. ఏ వాహనంలోనైనా తీసుకెళ్లవచ్చు. అలాగే కాగితం విగ్రహాలు చాలా తేలికగా ఉంటాయి. నిర్వహణ కూడా సులభం. ఈ రకమైన గణపతి పర్యావరణానికి హాని కలిగించదు. దీంతో కస్టమర్లు పేపర్ గణేష్ కొనుగోలుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు

ఒకవైపు వినాయక చవితి పండుగకు విగ్రహాల విక్రయాలు అధికంగానే ఉన్నాయి. మరోవైపు పీఓపీ గణపన్కు కళ్లెం వేయడంతో వ్యాపారులు ఉలిక్కిపడ్డారు. అందుకే పేపర్ వినాయకుడి తయారీ వైపు ఎక్కువగా తయారీ దారులు ఆసక్తిని చూపించారు. అదే సముయంలో వినియోగదారులు కూడా ఎక్కువగా పేపర్ తో తయారు చేసిన బొజ్జ గణపయ్య విగ్రహాల కొనుగోలుకు ఆసక్తిని చూపిస్తున్నారు.

గతేడాదితో పోలిస్తే పేపర్ గణపయ్య విగ్రహాలకు భారీ డిమాండ్ నెలకొంది. దాదాపు 20 శాతం అమ్మకాలు పెరిగాయి. ఈ పేపర్ తో చేసిన వినాయక విగ్రహాలు రూ. 100 నుంచి రూ. 2 లక్షల మధ్య వినాయక విగ్రహాల వరకూ మార్కెట్ లో లభిస్తున్నాయి. ఈ తరహా విగ్రహాలను



















