Vontimitta: పౌర్ణమి వెన్నెల్లో సీతమ్మను పెళ్లి చేసుకున్న రామయ్య.. ఇద్దరు దొంగలు కట్టిన కళా ఖండం చరిత్ర తెలుసా..
కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీరాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈనెల 16వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా ఈరోజు 22వ తారీకు రాత్రి నిండు పౌర్ణమి నాడు పండు వెన్నెలలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ అదనపు సెక్రటరీ కరికాల వల్లవన్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి ఈరోజు కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 26వ తారీకు పుష్ప యాగంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా టీటీడీ అధికారులు బ్రహ్మోత్సవాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఈరోజు కళ్యాణాన్ని నిర్వహించారు.
Most Read Stories