- Telugu News Photo Gallery Spiritual photos Do you know where the temple where Lord Krishna heart still beats is located?
ఇప్పటికీ శ్రీ కృష్ణుడి గుండె కొట్టుకుంటూ ఉండే ఆలయం ఎక్కడుందో తెలుసా?
శ్రీకృష్ణజన్మాష్టమిని హిందువులందరూ ఆగస్టు 16 శనివారం రోజున ఘనంగా జరుపుకుంటారు. అన్ని పండుగలలో ఇది కూడా ఒకటి. అయితే జన్మాష్టమి సందర్భంగా ఇప్పుడు మనం కృష్ణుడికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, ముఖ్యంగా ఇప్పటికీ శ్రీకృష్ణుడి గుండె కొట్టుకుంటూ ఉన్న విషయం మీకు తెలుసా? దీని గురించే ప్రత్యేకంగా తెలుసుకుందాం.
Updated on: Aug 15, 2025 | 7:38 PM

మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్ర గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇందులో యుద్ధం ముగిసిన తర్వాత చాలా రోజుల పాటు శ్రీకృష్ణుడు ద్వారకాలో చాలా ఆనందంగా జీవిస్తాడు. కానీ తర్వాత శాపం కారణంగా ఆయన మరణిస్తాడు. అయితే ఆయన మరణించిన తర్వాత శ్రీకృష్ణుడు పూర్తిగా కాలిపోతాడు కానీ, ఆయన గుండె మాత్రం చెక్కు చెదరకుండా అలానే కొట్టుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పటికీ ఆ గుండె అలానే కొట్టుకుంటూ.. ఓ గుడిలో ఉన్నదంట. ఇంతకీ ఆ ఆలయం ఏది అంటే?

మహాభారతం కురుక్షేత్ర మహా సంగ్రామంలో శ్రీకృష్ణుడి పాత్ర చాలా కీలకం. ఈ యుద్ధంలో కౌరవులు అందరూ పాండవుల చేతిలో చనిపోతారు. దీంతో తన నూరుగురు సంతానాన్ని కోల్పోయిన గాంధారి చాలా ఏడుస్తూ.. బాధపడుతుంటుంది. అంతే కాకుండా శ్రీకృష్ణుడి వలన తన సంతానం మరణించింది అంటూ కన్నయ్యను నిందిస్తుంది. ఆ క్రమంలోనే ఆమె శ్రీ కృష్ణుడికి శాపం పెడుతుంది. మహావిష్ణువు రూపం ఆయిన నువ్వు నా గర్భశోకాన్ని ఆపలేకపోయావు, నీ తల్లిని అడుగు కడుపుకోత అంటే ఏంటో.. తాను చెబుతుందని శోకం పెడుతుంది..

అప్పుడు శ్రీ కృష్ణుడు చిన్నగా చిరు నవ్వు నవ్వుతూ.. నేను ముందే చెప్పాను ఇది జరుగుతుందని అంటాడు. అప్పుడు గాంధారి ఆగ్రహానికిలోనై, ఈ రోజు నుంచి సరిగ్గా 36 ఏళ్లకి నువ్వు మరణిస్తావు, ద్వారకా మునిగిపోతుంది. యాదవులంతా అందులో కొట్టుకపోయి చనిపోతారు అంటూ శాపం పెడుతుంది. దాని ఫలితంగా, ఓ వేటగాడి బాణం శ్రీకృష్ణుడి పాదాలకు తగిలి ఆయన మరణిస్తారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పాండవులు కృష్ణుడికి అంత్యక్రియలు జరిపిస్తారు.

అయితే అంతిమ సంస్కారాలు నిర్వహించిన తర్వాత, చితిలో శ్రీ కృష్ణుడి శరీరం మొత్తం కాలిపోయినప్పటికీ, ఆయన గుండె మాత్రం చెక్కు చెదరకుండా కొట్టుకుంటూ కనిపిస్తుంది. దీంతో పాండవులు అది గమనించి, ఆ హృదాయన్ని సముద్రపు నీటిలో వేస్తారు. దీంతో అది తేలియాడుతూ.. ఒడిశాలోని పూరితీరానికి చేరుకుంటుంది.

అంతే కాకుండా, ఆ గుండె సజీవంగా ఉంటూనే, ఓ కర్రలా మారిపోతుంది. తర్వాత పూరి రాజు ఇంద్రద్యుమ్నుడికి వ శ్రీకృష్ణుడి గుండె కర్రరూపంలో వచ్చిందని కల కంటాడు. మరసటి రోజు ఆయన వెళ్లి చూస్తే అక్కడ కర్ర రూపంలో ఉన్న శ్రీ కృష్ణుడి గుండెను చూసి ఆయన ఆశ్చర్యపోతాడు. దీంతో అక్కడే శ్రీకృష్ణుడికి ఆ కర్రతో జగన్నాథ విగ్రహాన్ని తయారు చేయించి, గుడి కట్టిస్తాడు.

ఆ గుడి గర్భగుడిలో కర్రలా ఉన్న శ్రీకృష్ణుడి గుండెను, బలభద్రుడు, సోదరి సుభద్ర దేవి విగ్రహాలను ప్రతిష్టించి పూజలు జరిపిస్తాడు. ఇక అక్కడి వారి నమ్మకాల ప్రకారం, ఇప్పటికీ ఆ ఆలయం గర్భగుడిలో శ్రీకృష్ణుడి హృదయం కొట్టుకుంటుందని చెబుతుంటారు.(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)



