Ayodhya: బాల రామయ్య కొలువుదీరిన వేళ అంబరాన్ని అంటిన సంబరాలు.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ రామ నామ స్మరణే..
అయోధ్యలో తన జన్మస్థలం రామ మందిరంలోని గర్భ గుడిలో బాల రాముడు కొలువుదీరాడు. దీంతో కోట్లాది హిందువులు సంబరాలు జరుపుకున్నారు. రామ భక్తుల్లో సంతోషం వెల్లివిరిసింది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాల్లో ప్రజలు కాషాయ రంగులో కనిపించారు. కొన్ని చోట్ల జై శ్రీరామ్ అంటూ ర్యాలీలను నిర్వహించారు. మరికొన్ని చోట్ల సంకీర్తనలు చేస్తూ సందడి చేశారు. అయోధ్యకు ఆనుకుని ఉన్న కాశీ కూడా మారిపోయి కనిపించింది. అందరి నోటి నుంచి ఒకే నామ స్మరణ జై శ్రీరామ్. రామ నామ జపంతో దేశం మారుమ్రోగింది. ప్రాణ ప్రతిష్ట సమయంలో దేశంలో రామ్ లల్లాను ఎలా స్వాగతించారో నెట్టింట్లో రకరకాల ఫోటోలు సందడి చేశాయి.
Most Read Stories