దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఈ నెల 8వ తేదీన వైఎస్ షర్మిల పార్టీని ప్రకటించనున్నారు. ఫిల్మ్ నగర్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్సార్టీపీ ఆవిర్భావ సభ జరగనుంది. ఇప్పటికే 'వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ'గా పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
1 / 4
ఇదిలా ఉంటే దీనికి సంబంధించి రోడ్డు మ్యాప్ తాజాగా ఖరారైంది. ఈ నెల 8వ తేదీన వైఎస్ షర్మిల బెంగళూరు నుంచి బైరోడ్డు ఇడుపులపాయకు చేరుకోనున్నారు. జూలై 8వ తేదీ ఉదయం 8.30 గంటలకు ఇడుపులపాయలో ప్రార్థనలు చేసిన అనంతరం కడప నుంచి ప్రత్యేక చాపర్లో 2 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు
2 / 4
ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు పంజాగుట్ట చౌరస్తాలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైఎస్ షర్మిల పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు.
3 / 4
ఇక సాయంత్రం 4 గంటలకు JRC కన్వెన్షన్కు చేరుకొని.. 5 గంటలకు వైఎస్ షర్మిల పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయనున్నారు.