AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: తనయుడు అకీరాను మోదీకి పరిచయం చేసిన పవన్ కళ్యాణ్.. ఫోటోస్ వైరల్..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీ గెలుపొందారు జనసేన అధినేత..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తాజాగా ఎన్టీఏ సమావేశంలో పాల్గొనేందుకు తన భార్య అన్నా లెజినోవా, కురుమారు అకిరా నందన్‏తో కలిసి ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీని కలుసుకున్నారు.

Rajitha Chanti
|

Updated on: Jun 06, 2024 | 5:14 PM

Share
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీ గెలుపొందారు జనసేన అధినేత..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తాజాగా ఎన్టీఏ సమావేశంలో పాల్గొనేందుకు తన భార్య అన్నా లెజినోవా, కురుమారు అకిరా నందన్‏తో కలిసి ఢిల్లీ వెళ్లారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీ గెలుపొందారు జనసేన అధినేత..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తాజాగా ఎన్టీఏ సమావేశంలో పాల్గొనేందుకు తన భార్య అన్నా లెజినోవా, కురుమారు అకిరా నందన్‏తో కలిసి ఢిల్లీ వెళ్లారు.

1 / 5
ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా తన తనయుడు అకీరా నందన్‏ను ప్రధాని మోదీకి పరిచయం చేశారు పవన్. అలాగే మోదీకి చేతులు జోడించి నమస్కరిస్తూ కనిపించాడు అకీరా నందన్. అదే సమయంలో మోదీ అకీరా మీద చేయి  పవన్ కళ్యాణ్‏తో మాట్లాడుతున్నారు.

ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా తన తనయుడు అకీరా నందన్‏ను ప్రధాని మోదీకి పరిచయం చేశారు పవన్. అలాగే మోదీకి చేతులు జోడించి నమస్కరిస్తూ కనిపించాడు అకీరా నందన్. అదే సమయంలో మోదీ అకీరా మీద చేయి పవన్ కళ్యాణ్‏తో మాట్లాడుతున్నారు.

2 / 5
ప్రధాని నివాసంలో పవన్ కళ్యాణ్ కుటుంబసమేతంగా మోదీని కలిసిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో పవన్ విజయం సాధించినప్పటి నుంచి అకీరా నందన్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. పవన్ ఇంటివద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకోగా.. వారికి నమస్కరిస్తూ కనిపించాడు.

ప్రధాని నివాసంలో పవన్ కళ్యాణ్ కుటుంబసమేతంగా మోదీని కలిసిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో పవన్ విజయం సాధించినప్పటి నుంచి అకీరా నందన్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. పవన్ ఇంటివద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకోగా.. వారికి నమస్కరిస్తూ కనిపించాడు.

3 / 5
అలాగే తేదేపా అధినేత చంద్రబాబు వద్దకు వెళ్లినప్పుడు తన భార్య అన్నా లెజేనోవాతోపాటు తనయుడు అకీరాను తీసుకెళ్లారు. చంద్రబాబుకు పరిచయం చేశారు పవన్ కళ్యాణ్. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలవడంతో తండ్రిపై ప్రేమను చాటుతూ స్పెషల్ వీడియో షేర్ చేశాడు అకీరా నందన్.

అలాగే తేదేపా అధినేత చంద్రబాబు వద్దకు వెళ్లినప్పుడు తన భార్య అన్నా లెజేనోవాతోపాటు తనయుడు అకీరాను తీసుకెళ్లారు. చంద్రబాబుకు పరిచయం చేశారు పవన్ కళ్యాణ్. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలవడంతో తండ్రిపై ప్రేమను చాటుతూ స్పెషల్ వీడియో షేర్ చేశాడు అకీరా నందన్.

4 / 5
పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 2019లో మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లారు. ఆ సమయంలో పవన్ కు పరాజయం ఎదురైంది. 2024లో పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు.

పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 2019లో మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లారు. ఆ సమయంలో పవన్ కు పరాజయం ఎదురైంది. 2024లో పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు.

5 / 5