- Telugu News Photo Gallery Political photos CM Revanth Reddy, BRS chief KCR participats in the Telangana Formation Day celebrations.
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలు.. అమరవీరుల స్థూపానికి సీఎం రేవంత్, కేసీఆర్ నివాళి..
తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ఆవిర్బావ వేడుకలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. సీఎం రేవంత్రెడ్డి ముందుగా గన్పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర నివాళుర్పించారు. తదనంతరం పరేడ్ గ్రౌండ్కు వెళ్లారు. తెలంగాణభవన్లో జరిగిన వేడుకల్లో పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. అమరవీరుల స్తూపానికి నమస్కరించి నివాళి అర్పి్ంచారు కేసీఆర్. తదనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ సాధించుకున్న లక్ష్యంపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ తో పాటు, కేటీఆర్, పొన్నాల లక్ష్మయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated on: Jun 02, 2024 | 7:35 PM

తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ఆవిర్బావ వేడుకలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. సీఎం రేవంత్రెడ్డి ముందుగా గన్పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర నివాళుర్పించారు. తదనంతరం పరేడ్ గ్రౌండ్కు వెళ్లారు.

అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలు శాఖలకు చెందిన మంత్రులు పాల్గొన్నారు. ఈ ఏర్పాట్లను సీఎస్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

తమ ప్రభుత్వం వచ్చాక పాలనను గాడిలో పెట్టి ప్రజలకు అన్నిరకాలా సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సతీమణి, కుమార్తె పాల్గొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనను తిలకించి, జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు.

తెలంగాణభవన్లో జరిగిన వేడుకల్లో పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. అమరవీరుల స్తూపానికి నమస్కరించి నివాళి అర్పి్ంచారు కేసీఆర్. తదనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ సాధించుకున్న లక్ష్యంపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ తో పాటు, కేటీఆర్, పొన్నాల లక్ష్మయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు పలు ఆసుపత్రులు, అనాథ శరణాలయాల్లో పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు.
