- Telugu News Photo Gallery Political photos AP Election Result celebrations in TDP Chief Chandrababu family home see photos
AP Election Result: ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం.. చంద్రబాబు ఇంట్లో సంబరాలు..
ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. ఫలితాల్లో సునామీ సృష్టిస్తూ దూసుకెళ్తోంది. ఊహించనన్ని స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ సర్వే సంస్థల అంచనాలను తలకిందులు చేస్తూ నెంబర్ గేమ్లో పరుగులు పెడుతోంది. దీంతో చంద్రబాబు ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. నారా చంద్రబాబు భువనేశ్వరీ దంపతులు హర్షం వ్యక్తంచేస్తూ.. కేక్ కట్ చేశారు. అంతేకాకుండా.. నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ కూడా కేక్ ఒకరినొకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
Phani CH |
Updated on: Jun 04, 2024 | 4:07 PM

టీడీపీ కూటమి 162 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.. వైసీపీ 13 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.. ఇప్పటికే.. టీడీపీ 54, బీజేపీ 1, జనసేన 9 స్థానాల్లో విజయం సాధించాయి.

కూటమి కట్టినప్పుడే సగం విజయం ఖాయమై పోయిందని అప్పుడే భావించాయి టీడీపీ, జనసేన, బీజేపీ. ఇప్పుడు వాళ్ల అంచనాలు అక్షరాలా నిజమవుతున్నాయి. కూటమి విజయకేతనం ఎగరవేస్తోంది. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లోనూ సత్తా చాటుతోంది టీడీపీ కూటమి.

కృష్ణా, గుంటూరులో ఇప్పటిదాకా వైసీపీ బోణికొట్టలేదు. ఇక శ్రీకాకుళంలో క్లీన్ స్వీప్ దిశగా కూటమి ముందుకెళ్తోంది. ఒక్క పాలకొండలో మాత్రమే వైసీపీ ఆధిక్యంలో ఉంది. ఇక సీమలో 52 స్థానాల్లో 40కి పైగా కూటమి లీడ్ లో ఉందంటే.. వైసీపీపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రధానంగా పవన్ పిఠాపురంలో స్పష్టమైన మెజార్టీ అందరీ దృష్టిని ఆకర్షించింది. మొదట్ రౌండ్ నుంచే ఆయన అదిక్యం చూపించారు. సమీప ప్రత్యర్థి వంగా గీత పై భారీ మెజార్టీతో గెలుపొందారు.

ఇంతకీ కూటమికి కలిసొచ్చిన అంశాలేంటి? చంద్ర బాబు అరెస్ట్ అంశం చాలా పెద్ద ఎఫెక్ట్ చూపించిందని సర్వత్రా వినిపిస్తోంది. సైలెంట్గానే ఈ విషయం వైసీపీకి పెద్ద దెబ్బ వేసినట్లు కనిపిస్తోంది. ఇది టీడీపీకి సానుకూల అంశం అనే వాదన వినిపిస్తోంది.

రాజధాని మార్పు కూడా వైసీపీకి గట్టిగా దెబ్బకొట్టినట్టు కనిపిస్తోంది. రాజధాని మారుస్తానని ప్రకటించడం తప్ప ఐదేళ్లుగా వైజాగ్కు చేసింది కూడా ఏమీ లేదు. ఇది టీడీపీ విజయానికి అనుకూలించిందనే టాక్ వినిపిస్తోంది.

కమలంతో జత కట్టడం టీడీపీకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దీని కారణంగానే కొత్త ఉత్సాహం వచ్చినట్లు కనిపింది. టీడీపీ భారీ మెజారిటీతో గెలుపొందటానికి కారణంగా నిలిచింది.

భూములను రీసర్వే చేయడం.. పాస్ బుక్లపై జగనన్నా ఫోటో వేయడం లాంటి అంశాలు కూడా ఎన్నికల ముందు పెద్ద చర్చకు దారితీశాయి. దీని వల్ల కూడా వైసీపీపై ప్రతికూల ప్రభావం పడిందని అనుకోవచ్చు. ఇది టీడీపీకి సానుకూలించింది.

టీడీపీ మేనిఫెస్టో ఆకర్షణగా నిలిచింది. పలు ప్రజాకర్షణ పథకాలు ఇందులో ఉన్నాయి. టీడీపీకి మరింత మైలేజ్ వచ్చిందని అనుకోవచ్చు. కానీ వైసీపీ మేనిఫెస్టో అంతంత మాత్రంగానే కొత్తగా ఏమీ లేదు. ప్రస్తుత స్కీమ్స్నే కొనసాగించారు. అది వైసీపీకి మారినట్టు స్పష్టమవుతోంది.



















