పారిజాతం మొక్క లాభాలు తెలిస్తే షాకవ్వాల్సిందే..అజీర్ణం, కీళ్ల నొప్పులతో పాటు ఆ సమస్యలకు చెక్!
పారిజాతం ఆకులు, పూలను ఆయుర్వేదంలో అద్భుత ఔషధంగా పరిగణిస్తారు. అందుకే ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేదంలో పలు రకాల అనారోగ్య సమస్యలకు మందుగా వాడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అంతకు మించి వాటి వల్ల ఉండే ప్రయోజనాలేంటో మనకు తెలియదు. అయితే వాటిని ఆహారంలో ఉపయోగించడం వల్ల చాలా లాభాలుంటాయి. అవేంటో తెలిస్తే వీటిని మీరు అస్సలు వదిలి పెట్టరు. ఆయుర్వేదంలో ఈ చెట్టు బెరడు, కొమ్మలు, ఆకులు, పువ్వులను కూడా ఔషధంగా వినియోగిస్తారు. అదెలాగో ఏంటో తెలుసుకుందాం రండి.
Updated on: Apr 29, 2025 | 11:43 AM

పారిజాత పువ్వులు, ఆకుల్లో యాంటీ పైరటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. రకరకాల జ్వరాలను తగ్గించడానికి ఇది మంచి మందులా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్టు బెరడును తీసి నీటిలో వేసి మరిగించి కషాయంలా తాగడం వల్ల ఎలాంటి జ్వరం అయినా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

మోకాళ్ల నొప్పులు సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు పారిజాతం అద్భుతంగా పనిచేస్తుంది. ఆర్థరైటిస్ కీళ్ల నొప్పులు తగ్గడానికి పారిజాత పూల టీ లేదా ఆకుల టీ పనికి వస్తుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది వాపులను సమర్థవంతంగా తగ్గిస్తుంది.

ఆయుర్వేదం ప్రకారం మానవ శరీరంలో పిత్త దోషం వల్ల అజీర్ణం సమస్య తలెత్తుతుంది. ఈ దోషాన్ని సరి చేయడంలో పారిజాత పుష్పం ఔషధంలా పని చేస్తుంది. పారిజాత పూల టీని క్రమం తప్పకుండా రోజూ తాగుతూ ఉండటం వల్ల స్త్రీ సంబంధమైన అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

శ్వాస కోశ సమస్యలు ఉన్న వారు పారిజాతం ఆకులు, పూల టీని చేసుకుని తేనె కలుపుకుని పరగడుపున రోజూ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని ఇది పలుచన చేసి బయటకు తోసి వేస్తుంది. అందువల్ల ఈ ఇబ్బందులన్నీ తగ్గుముఖం పడతాయి.

పారిజాతం ఆకులను తేనె, అల్లంతో రోజుకి రెండుసార్లు తీసుకుంటే కాలేయ సమస్యల నుంచి బయటపడొచ్చు. పారిజాతం పూలు గుండె సమస్యల్ని కూడా పోగొడతాయి. పొడి దగ్గుతో బాధపడే వారు పారిజాతం ఆకులలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు.




