IPL 2025: కేఎల్ రాహుల్కి వెన్నుపోటు పక్కా.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా దమ్మున్నోడు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-17లో రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్కు నాయకత్వం వహించాడు. పంత్ ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్లో ఉన్నాడు. ఇప్పుడు కొత్త కెప్టెన్ కోసం వెతుకుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ వద్ద మూడు ఛాయిస్లు ఉన్నాయి.
Updated on: Dec 01, 2024 | 10:40 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో కొత్త కెప్టెన్ల నేతృత్వంలో 5 జట్లు ఉంటాయి. ఈ ఐదు జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. అయితే ఢిల్లీ జట్టుకు ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఎందుకంటే జట్టులో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఈ ముగ్గురికి నాయకత్వ అనుభవం కూడా ఉంది.

ముఖ్యంగా గత సీజన్లో రెండు జట్లకు నాయకత్వం వహించిన ఇద్దరు మాజీ కెప్టెన్లు ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్నారు. కాబట్టి ఈసారి ఢిల్లీ జట్టు ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఆసక్తిగా మారింది.

కేఎల్ రాహుల్: ఈ మెగా వేలం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ను రూ. 14 కోట్లకు కొనుగోలు చేసింది. వికెట్ కీపర్, ఓపెనర్ అయిన రాహుల్ గత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్కు కెప్టెన్గా వ్యవహరించాడు. ఐపీఎల్లో 64 మ్యాచ్లకు కెప్టెన్గా కూడా కనిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రాహుల్ను కెప్టెన్సీ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఫాఫ్ డుప్లెసిస్: గత సీజన్లో RCB జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన ఫాఫ్ డుప్లెసిస్ ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడనున్నాడు. రూ.2 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్లో చేరిన ఫాఫ్ కెప్టెన్సీపై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఫాఫ్ ఐపీఎల్లో 42 మ్యాచ్లకు కెప్టెన్గా కనిపించాడు. దక్షిణాఫ్రికా జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం కూడా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ అనుభవజ్ఞుడైన కెప్టెన్ కోసం వెళితే ఫాఫ్కు పగ్గాలు దక్కే అవకాశం ఉంది.

అక్షర్ పటేల్: ఈసారి ఐపీఎల్ మెగా వేలానికి ముందు, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ అక్షర్ పటేల్ను రూ. 16.5 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఈ రిటైన్ తర్వాత అక్షర్ను ఢిల్లీ కెప్టెన్ చేయాలని చూస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అక్షర్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్కు నాయకత్వం వహించాడు.




