Andhra Pradesh: 50 ఏళ్లలో ఎన్నడూ చూడని బీభత్సం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అటుఏపీలో కురుస్తున్న కుండపోత వర్షాల నేపథ్యంలో జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది కూడా కలగకూడదున్నారు సీఎం చంద్రబాబు. అధికారులు బాధ్యతలు నిర్వర్తించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యేలతో కలసి మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని చంద్రబాబు ఆదేశించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
