- Telugu News Photo Gallery Cinema photos Tripti Dimri Interesting Comments On Animal park Movie telugu movie news
Tripti Dimri: ఆ విషయాలపై నాకు అసలు అవగాహనే లేదు.. యానిమల్ సీక్వెల్ పై త్రిప్తి దిమ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు..
డైరెక్టర్ సందీప్ రెడ్డి డైరెక్షన్లో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా యానిమల్. ఇందులో జోయా పాత్రలో నటించి యూత్ హార్ట్ కొల్లగొట్టింది హీరోయిన్ త్రిప్తి దిమ్రీ. యానిమల్ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఈ అమ్మడుకు అటు బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇటీవలే బ్యాడ్ న్యూస్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన త్రిప్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
Updated on: Jul 28, 2024 | 8:32 AM

డైరెక్టర్ సందీప్ రెడ్డి డైరెక్షన్లో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా యానిమల్. ఇందులో జోయా పాత్రలో నటించి యూత్ హార్ట్ కొల్లగొట్టింది హీరోయిన్ త్రిప్తి దిమ్రీ.

యానిమల్ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఈ అమ్మడుకు అటు బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇటీవలే బ్యాడ్ న్యూస్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన త్రిప్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఈ క్రమంలో యానిమల్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ సినిమా తన కెరీర్ కు చాలా ఉపయోగపడిందని.. యానిమల్ పార్క్ గురించి తనకు ఏమాత్రం తెలియదని అన్నారు. ఈ సినిమా తర్వాతే తనకు అభిమానులు ఎక్కువయ్యారని తెలిపింది.

ఇప్పుడిప్పుడే తన పాత సినిమాలను చూస్తున్నారని.. అందులో నటించినందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. చాలా మంది గొప్ప నటీనటులతో పనిచేయడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చింది. యానిమల్ చిత్రానికి చాలా విమర్శలు వచ్చాయని అన్నారు.

కానీ సినీరంగంలో ఇలాంటివి కామన్ అని అన్నారు. ఇక యానిమల్ పార్క్ సినిమా గురించి మాట్లాడుతూ.. సినీ ప్రియుల మాదిరిగానే తనకు కూడా ఈ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదని.. సినిమా కథ, ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయాలపై అవగహన లేదన్నారు.





























