Tollywood: టాప్ 5 క్రేజీ న్యూస్ అండ్ లేటెస్ట్ మూవీస్ షూటింగ్ అప్డేట్స్
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగా దిల్రాజు ఎంపికయ్యారు. సి.కల్యాణ్ పై ఆయన 31 ఓట్లతో గెలుపొందారు. ఆదివారం తెలుగు ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు జరిగాయి. 1,339 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇండస్ట్రీని ఒక తాటి మీదకు తీసుకురావాలి, భవిష్యత్తు తరాలకు మంచి పరిశ్రమను అందించాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు దిల్రాజు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Rajeev Rayala
Updated on: Jul 31, 2023 | 2:18 PM

తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగా దిల్రాజు ఎంపికయ్యారు. సి.కల్యాణ్ పై ఆయన 31 ఓట్లతో గెలుపొందారు. ఆదివారం తెలుగు ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు జరిగాయి. 1,339 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇండస్ట్రీని ఒక తాటి మీదకు తీసుకురావాలి, భవిష్యత్తు తరాలకు మంచి పరిశ్రమను అందించాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు దిల్రాజు.

రికార్డు శ్రీవిష్ణు హీరోగా నటించిన సినిమా 'సామజవరగమన'. థియేటర్లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆహాలో ప్రసారమవుతుంది 'సామజవరగమన'. తాజాగా ఆహా ఓటీటీలోనూ రికార్డు సృష్టించింది. కేవలం 40 గంటల్లోనే 100 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ఆదరణ తెచ్చుకుంది 'సామజవరగమన'.

సీక్వెల్లో తార నయనతార కీలక పాత్రలో నటించిన సినిమా 'కోలమావు కోకిల'. బ్లాక్ కామెడీ క్రైమ్ మూవీ ఇది. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వం వహించారు. 2018లో విడుదలైంది. ఈ చిత్రంలో కీ రోల్ చేశారు యోగిబాబు. 'కోలమావు కోకిల' సినిమాకు నెల్సన్ సీక్వెల్ సిద్ధం చేస్తున్నారని చెప్పారు యోగిబాబు. ప్రస్తుతం నయనతార చేతిలో ఉన్న సినిమాలు పూర్తి కాగానే సీక్వెల్ షూటింగ్లో పాల్గొంటారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా 'భోళా శంకర్'. ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ కటౌట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 126 అడుగుల ఎత్తున్న కటౌట్ అది. సూర్యపేట - విజయవాడ నేషనల్ హై వే మీద ఏర్పాటు చేశారు. మెగా సెలబ్రేషన్లకు కౌంట్ డౌన్ మొదలైంది అంటూ సోషల్ మీడియాలో ఈ కటౌట్ షేర్ చేస్తున్నారు.

హెబ్బా పటేల్, సుమన్ వూటుకూరు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'సందేహం'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది. 'చచ్చినా చావని ప్రేమిది' అనే గీతాన్ని దర్శకుడు దశరథ్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తప్పక హిట్ అయ్యే మూవీ అని అన్నారు హెబ్బా పటేల్.





























