AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tanushree Datta: జనాలు మమ్మల్ని మనుషుల్లా చూడరు.. తను శ్రీ దత్తా క్రేజీ కామెంట్స్

బాలీవుడ్ హీరోయిన్ తను శ్రీ దత్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం నడిచినప్పుడు ఆమె పేరు ఎక్కువగా వినిపించింది. ప్రముఖ నటుడు నానా పాటేర్ తనను తీవ్రంగా వేధించారని గతంలో ఆమె ఆరోపణలు చేసింది.

Rajeev Rayala
|

Updated on: Aug 23, 2024 | 9:04 PM

Share
బాలీవుడ్ హీరోయిన్ తను శ్రీ దత్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం నడిచినప్పుడు ఆమె పేరు ఎక్కువగా వినిపించింది. ప్రముఖ నటుడు నానా పాటేర్ తనను తీవ్రంగా వేధించారని గతంలో ఆమె ఆరోపణలు చేసింది.

బాలీవుడ్ హీరోయిన్ తను శ్రీ దత్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం నడిచినప్పుడు ఆమె పేరు ఎక్కువగా వినిపించింది. ప్రముఖ నటుడు నానా పాటేర్ తనను తీవ్రంగా వేధించారని గతంలో ఆమె ఆరోపణలు చేసింది.

1 / 5
ఆమె గొంతు విప్పిన తర్వాత ఇండస్ట్రీలోని పలువురు నటీమణులు సైతం తాము ఎదుర్కొన్న చేదు సంఘటనలను బయటపెట్టారు. అయితే మీటూ ఉద్యమం తర్వాత తనకు సినిమా అవకాశాలు రాకుండా వేధిస్తున్నారని ఇప్పటికే పలుమార్లు తను శ్రీ సోషల్ మీడియా వేదికగా వాపోయింది.

ఆమె గొంతు విప్పిన తర్వాత ఇండస్ట్రీలోని పలువురు నటీమణులు సైతం తాము ఎదుర్కొన్న చేదు సంఘటనలను బయటపెట్టారు. అయితే మీటూ ఉద్యమం తర్వాత తనకు సినిమా అవకాశాలు రాకుండా వేధిస్తున్నారని ఇప్పటికే పలుమార్లు తను శ్రీ సోషల్ మీడియా వేదికగా వాపోయింది.

2 / 5
సినిమాలకంటే వివాదాల్లోనే ఈ అమ్మడు ఎక్కువగా పాపులర్ అయ్యింది. తెలుగులో ఈ చిన్నది ప్రయాణం అనే సినిమా చేసింది ఈ సినిమాలో మంచు మనోజ్ హీరోగా నటించాడు. అలాగే ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా కనిపించింది. 

సినిమాలకంటే వివాదాల్లోనే ఈ అమ్మడు ఎక్కువగా పాపులర్ అయ్యింది. తెలుగులో ఈ చిన్నది ప్రయాణం అనే సినిమా చేసింది ఈ సినిమాలో మంచు మనోజ్ హీరోగా నటించాడు. అలాగే ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా కనిపించింది. 

3 / 5
ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఈ అమ్మడు తెరపైకి వచ్చింది. మలయాళ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతోన్న లైంగిక వేధింపుల కోసం జస్టిస్ హేమ కమిటీ, ప్రభుత్వం నియమించిన ప్యానెల్ ఓ నివేదికను తయారు చేసింది. దీని పై తను శ్రీ దత్తా స్పందించింది. 

ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఈ అమ్మడు తెరపైకి వచ్చింది. మలయాళ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతోన్న లైంగిక వేధింపుల కోసం జస్టిస్ హేమ కమిటీ, ప్రభుత్వం నియమించిన ప్యానెల్ ఓ నివేదికను తయారు చేసింది. దీని పై తను శ్రీ దత్తా స్పందించింది. 

4 / 5
ఈ నేపథ్యంలో హేమ కమిటీ నివేదిక వల్ల ప్రయోజనం ఉండదని  తనుశ్రీ దత్తా తెలిపింది. 2017లో జరిగిన దాని గురించి నివేదికను రూపొందించడానికి వారికి 7 సంవత్సరాలు పట్టిందా.?  నిందితులను అరెస్ట్ చేసి చట్టం ముందు శిక్షించడమే వాళ్లు చేయాల్సింది. స్త్రీలను గౌరవంగా చూడాలి. జనాలు నటులను మనుషులుగా చూడరు. మేం రాణుల్లా చూసుకోమని అడగం. గౌరవంగా చూస్కుంటే చాలు. నిరసన తెలిపే హక్కు మాకుంది చెప్పుకొచ్చింది. 

ఈ నేపథ్యంలో హేమ కమిటీ నివేదిక వల్ల ప్రయోజనం ఉండదని  తనుశ్రీ దత్తా తెలిపింది. 2017లో జరిగిన దాని గురించి నివేదికను రూపొందించడానికి వారికి 7 సంవత్సరాలు పట్టిందా.?  నిందితులను అరెస్ట్ చేసి చట్టం ముందు శిక్షించడమే వాళ్లు చేయాల్సింది. స్త్రీలను గౌరవంగా చూడాలి. జనాలు నటులను మనుషులుగా చూడరు. మేం రాణుల్లా చూసుకోమని అడగం. గౌరవంగా చూస్కుంటే చాలు. నిరసన తెలిపే హక్కు మాకుంది చెప్పుకొచ్చింది. 

5 / 5
Follow Us