Mythology: మైథాలజీకి ఆడియన్స్లో క్రేజ్.. అన్నీ ఇండస్ట్రీల్లోనూ ఇదే ట్రెండ్..
సిల్వర్స్క్రీన్ మీద సోషల్ డ్రామాలే కాదు, మైథలాజికల్ కంటెంట్కి కూడా రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆసక్తిగా చూడాలనుకుంటున్నారు ఈ కంటెంట్ని. అందుకే అన్నీ ఇండస్ట్రీల్లోనూ పౌరాణికాలకు డిమాండ్ పెరుగుతోంది.
Updated on: Dec 03, 2024 | 9:45 AM

ఆలస్యమైందా ఆచార్య పుత్రా అంటూ కల్కిలో ప్రభాస్ కర్ణుడి గెటప్లో కనిపించినప్పుడు, అర్జునుడిగా విజయ్ దేవరకొండ అప్పియరెన్స్ ఇచ్చినప్పుడు ఆడియన్స్ అరుపులు, కేకలతో హోరెత్తిపోయాయి థియేటర్లు.

దీన్నిబట్టి పౌరాణికాలు, భక్తి చిత్రాలకు ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో స్పెషల్గా చెప్పక్కర్లేదు. రణ్బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా ఆల్రెడీ నార్త్లో రామాయణం తెరకెక్కుతోంది. మన దగ్గర కన్నప్ప సెట్స్ మీదుంది.

హనుమాన్ కాన్సెప్ట్ తో ప్యాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించారు ప్రశాంత్ వర్మ. ఈ ఏడాది సంక్రాంతికి చిన్న మూవీగా విడుదలైంది హనుమాన్. అయితే మైథలాజికల్ టచ్తో సాగే సబ్జెక్ట్ అందరినీ ఆకట్టుకుంది. నెక్స్ట్ కూడా ఇలాంటి కాన్సెప్టుతోనే అడుగులు వేస్తున్నారు కెప్టెన్. జై హనుమాన్ అంటూ రిషబ్శెట్టితో సినిమా చేస్తున్నారు.

అటు సూర్య కర్ణ ప్రాజెక్ట్ ఇంకా పెండింగ్లోనే ఉంది. రీసెంట్గా ఆయన నటించిన కంగువ సినిమా జనాలను పెద్దగా మెప్పించలేదు. దాంతో కొన్నాళ్ల పాటు ప్రయోగాలకు దూరంగా ఉండదలచుకున్నారు ఈ హీరో. ఒక్కసారి ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చారంటే కర్ణ సినిమా పట్టాలెక్కించాలన్నది ప్లాన్.

హోంబలే సంస్థ మహావతార్: నరసింహ అనే యానిమేషన్ ప్రాజెక్టుతో రెడీ అవుతోంది. నార్త్లో విక్కీ కౌశల్ హీరోగా పరశురాముడి కథతో మరో మహావతార్ మూవీ నిర్మాణంలో ఉంది. తెలుగులో జై హనుమాన్లో నటిస్తున్న రిషబ్ శెట్టి, కన్నడలో చేస్తున్న కాంతార కూడా డివైన్ సబ్జెక్టే.




