- Telugu News Photo Gallery Business photos Queue of premium bikes into the market in 2024, New Bikes details in telugu
New Bikes: 2024లో మార్కెట్లోకి ప్రీమియం బైక్స్ క్యూ.. ఇక రయ్రయ్మంటూ దూసుకుపోవడమే..!
భారతదేశంలో బైక్స్ ఉన్న క్రేజ్ వేరు. ఇటీవల కాలంలో యువత ఎక్కువగా నయా ఫీచర్స్తో వచ్చే ప్రీమియం బైక్స్ను అమితంగా ఇష్టపడుతున్నారు. అయితే ధర కాస్త ఎక్కువగా ఉన్నా అవి అందించే కంఫర్ట్స్ ముందు మిగిలిన విషయాలేమి ఆలోచించడం లేదు. ముఖ్యంగా 2024లో ప్రీమియం బైక్స్ భారత మార్కెట్లోకి క్యూ కట్టాయి. సూపర్ లుక్స్తో పాటు ఫీచర్స్పరంగా కూడా ఈ బైక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రీమియం బైక్స్ గురించి మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.
Updated on: Feb 06, 2024 | 6:30 PM

రాయల్ ఎన్ఫీల్డ్ షాట్గన్ 650 బైక్ను గతేడాది నిర్వహించిన మోటోవర్స్ ఫెస్టివల్లో రిలీజ్ చేసింది. షాట్గన్ 648 సీసీ సమాంతర ట్విన్ మోటార్తో 47హెచ్పీ, 52.3 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 795 ఎంఎం సీటు ఎత్తు, తక్కువ వీల్బేస్ మరియు 240 కేజీల బరువుతో, షాట్గన్ అందరినీ ఆకర్షిస్తుంది. 13.8 లీటర్ ఇంధన ట్యాంక్తో లాంగ్ రైడింగ్కు వెళ్లేవారికి అనువుగా ఉంటుంది. ట్రిప్పర్ నావిగేషన్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్తో కూడిన షాట్గన్ని సింగిల్-సీటర్గా లేదా పిలియన్ సీటుతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ ధర రూ. 3.59 లక్షల నుంచి రూ. 3.73 లక్షల మధ్య ఉంటుంది.

రివోల్ట్ మోటార్స్ ఆర్వీ 400 బీఆర్జెడ్ లాంచ్ చేయడం ద్వారా తన ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ లైనప్ను విస్తరించింది. ఈ బైక్ ఇది రూ. 1.38 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. ఆర్వీ 400 బీఆర్జెడ్ బుకింగ్లు ప్రస్తుతం అధికారిక వెబ్సైట్ లేదా రివోల్ట్ షోరూమ్ల ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్లో స్పోర్ట్, నార్మల్, ఎకో అనే మూడు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. 3.24 కేడబ్ల్యూహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీతో ఇది ఎకో మోడ్లో 150కిమీ, సాధారణ మోడ్లో 100కిమీ, స్పోర్ట్ మోడ్లో 80కిమీల పరిధిని అందిస్తుంది. ఈ బైక్ను పూర్తిగా చార్జ్ చేయడానికి 4 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. ముఖ్యంగా ఈ బైక్ కేవలం 3 మూడు గంటల్లో 0 నుంచి 75 శాతం ఛార్జింగ్ అవుతుంది.

హోండా ఎన్ఎక్స్ 500ని భారతదేశంలో అధికారికంగా రూ. 5.90 లక్షల ధరతో ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఈ అడ్వెంచర్ టూరింగ్ బైక్ తెలుపు, నలుపు, ఎరుపు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఎన్ఎక్స్ 500 స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్తో కూడిన 6-స్పీడ్ గేర్బాక్స్తో వస్తుంది. లిక్విడ్-కూల్డ్ 471 సీసీ సమాంతర-ట్విన్ ఇంజిన్ ద్వారా 47.5 హెచ్పీ, 43 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. స్టాండర్డ్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్తో వచ్చే ఈ బైక్ 5 అంగుళాల టీఎఫ్టీ డాష్ నావిగేషన్, నోటిఫికేషన్ల కోసం స్మార్ట్ఫోన్ కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది.

బజాజ్-కవాసకి భాగస్వామ్యంతో వస్తున్న కొత్త ఎలిమినేటర్ 450సీసీ మాన్స్టర్గా పూర్తి-న్యూ లుక్తో పాటు ఆధునిక సాంకేతికతతో వస్తుంది. ఎలిమినేటర్ 451 సీసీ లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజిన్తో వస్తుంది. ఈ బైక్ తక్కువ రెడ్లైన్తో పాటు క్రూయిజర్ లాంటి రైడ్బిలిటీని అనుమతిస్తుంది. ఈ బైక్ 45.4 హెచ్పీ శక్తిని, 42.6 ఎన్ఎం గరిష్ట టార్క్ను విడుదల చేస్తుంది. ఈ బైక్ ధ రూ.5.62 లక్షలు ఉంటుందని అంచనా.

జావా యెజ్డీ మోటార్సైకిల్స్ భారతదేశంలో ఇటీవల కొత్త జావా 350ని విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ. 2.15 లక్షలుగా ఉంటుంది. 334 సీసీ లిక్విడ్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజిన్ ద్వారా వచ్చే ఈ బైక్ 22బీహెచ్పీ, 28.2 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్తో ఆరు-స్పీడ్ గేర్బాక్స్తో ఈ బైక్ యువతను విపరీతంగా ఆకర్షిస్తుంది. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్తో పూర్తి చేసిన 280 ఎంఎం ఫ్రంట్ డిస్క్, 240 ఎంఎం వెనుక డిస్క్ బ్రేక్ ఈ బైక్ రైడర్లకు కొత్త అనుభవాన్ని ఇస్తుంది. జావా 350 క్రూయిజర్ క్లాసిక్ మెరూన్, నలుపు, మైక్స్, ఆరెంజ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.




