జ్యోతి మల్హోత్రాతో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా? పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేక్ తీసుకెళ్లినోడితో ఆమెకు లింకేంటి?
హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఎంబసీ అధికారులతో సంబంధాల కారణంగా గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు అయింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ హైకమిషన్కు కేక్ తీసుకువెళ్తున్న వ్యక్తితో ఆమె ఉన్న ఫోటో బయటకు వచ్చింది. పాకిస్తాన్కు రెండుసార్లు వెళ్లి, సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నందుకు ఆమెపై కేసు నమోదు చేశారు.

హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై గూఢచర్యం కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ ఎంబసీలో పనిచేస్తున్న వారితో ఆమెకు ఉన్న సంబంధాలపై అనుమానాలు తీవ్రమవుతున్నాయి. 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన రెండు రోజుల తర్వాత న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు కేక్ తీసుకువస్తున్న వ్యక్తితో మల్హోత్రా ఉన్నట్లుగా ఒక ఫోటో బయటకు వచ్చింది. పాకిస్తాన్ పర్యటన సందర్భంగా జ్యోతి తాను హాజరైన పార్టీకి సంబంధించిన వీడియోను రికార్డ్ చేసి, కేక్ తెచ్చిన వ్యక్తిని కలిసినట్లు అందులో చూడొచ్చు. ఇండియా, పాకిస్తాన్ మధ్య వివాదం తరువాత పోలీసులు, వివిధ నిఘా సంస్థలు దేశవ్యాప్తంగా సామాజిక వ్యతిరేక శక్తులపై చర్యలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ సహకారంతో గూఢచర్యం చేశారనే ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపిన దారుణమైన పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన రెండు రోజుల తర్వాత, ఏప్రిల్ 24న న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లోకి ప్రవేశించేటప్పుడు ఒక వ్యక్తి కేక్ తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియోలో ఆ వ్యక్తి వద్దకు విలేకరులు వచ్చి, కేక్ ఎందుకు తీసుకెళ్తున్నారని కూడా ప్రశ్నించారు. కానీ, అతను ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఆ సమయంలో అతను గోధుమ రంగు పఠానీ సూట్ ధరించి ఉన్నాడు.
జ్యోతి మల్హోత్రా ఏం చేసింది..?
‘ట్రావెల్ విత్ JO’ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న మల్హోత్రా, సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నందుకు, పాకిస్తాన్ పౌరుడితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నందుకు అరెస్టు అయింది. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పాకిస్తాన్ హైకమిషన్ నుండి అధికారిక డానిష్తో పరిచయం ఏర్పరుచుకుంది. 2024లో రెండుసార్లు పాకిస్తాన్ను సందర్శించింది. పాకిస్తాన్ నిఘా కార్యకర్తలు ఆమెను భారతదేశంలో తమ సోర్స్గా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు. పాకిస్తాన్కు సమాచారం చేరవేసినందుకు జ్యోతి మల్హోత్రాను విచారించారు. ఆమె ఢిల్లీలో పాకిస్తాన్ అధికారి అహ్సాన్-ఉర్-రహీమ్ను కలిసిందని, రెండుసార్లు పాకిస్తాన్కు ప్రయాణించిందని, సున్నితమైన సమాచారాన్ని పంచుకుందని ఆరోపించారు. ఆమెపై బీఎన్ఎస్ సెక్షన్ 152, అధికారిక రహస్యాల చట్టం, 1923 సెక్షన్లు 3, 4, 5 కింద అభియోగాలు మోపారు. తదుపరి దర్యాప్తు కోసం ఆమెను ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి తరలించారు.
पहलगाम आतंकी हमले के ठीक बाद, एक शख्स को दिल्ली स्थित पाकिस्तान उच्चायोग में केक पहुंचाते हुए देखा गया।
अब ज़रा सोचिए — ये वही व्यक्ति है जो पाक जासूस ज्योति मल्होत्रा के साथ भी देखा गया था। है न चौंकाने वाली बात?
वाकई डरावना है! pic.twitter.com/vAWg5o67xO
— Raj घिमिरे (@crockraj) May 19, 2025
पहलगाम आतंकी हमले के ठीक बाद, एक व्यक्ति को दिल्ली में पाकिस्तान उच्चायोग में केक लाते हुए देखा गया।
पाकिस्तानी उच्च आयोग में किसी का जन्मदिन नहीं था
यह लोग पहलगाम हमले पर खुशियां मनाने के लिए केक मांगे थे
अंदाज़ा लगाइए?
यह वही व्यक्ति है जो पाक जासूस ज्योति मल्होत्रा के… pic.twitter.com/ynG14aX2MY
— 🇮🇳Jitendra pratap singh🇮🇳 (@jpsin1) May 19, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




